తెలంగాణలో అన్నదాతకు అండగా నిలుస్తామని ప్రభుత్వం చెబతున్న మాటల్లో నిజమెంత వుందో.? తెలియదు కానీ రైతుల మరణాలు మాత్రం తగ్గడం లేదు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అన్నదాతలకు రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చామని చెప్పుకునే ప్రభుత్వ హయాంలోనే వారి మరణాలు సంబవిస్తున్నాయి. ఈ విషయమై విపక్షాలు ఇప్పటికే కేసీఆర్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి. సిద్దపేటను మోడల్ నియోజకవర్గంగా చెప్పుకునే సీఎం.. అక్కడే రైతు మరణం సంభవించడంతో పరిస్థితులు ఎలా వున్నాయన్న విషయాన్ని తెలుసుకోవాలని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టివిక్రమార్క సూచించారు.
తాజాగా ఈ ఘటనపై జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. యూరియా కోసం క్యూలైన్లో నిలబడి రైతు చనిపోవడం బాధాకరమని ఆయన అన్నారు. ఈ ఘటనపై తెలంగాణ మంత్రి మాట్లాడిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ఈ ఘటనపై పదవిలో ఉన్న వాళ్లు సరైన రీతిలో స్పందించాలని ఆయన కోరారు. కాకతాళీయంగా జరిగిన ఘటనగా పేర్కొనడం సముచితం కాదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది.
రైతులకు ఎంత మేరకు విత్తనాలు, ఎరువులు అవసరమవుతాయో అంచనా వేసి డిమాండ్ తగ్గ విధంగా సరఫరా చేయడం ప్రభుత్వ బాధ్యత అని పవన్ కళ్యాణ్ తెలిపారు. అందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం యుద్ధప్రాదిపదికన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. యూరియా కోసం క్యూలైన్లో నిలబడి చనిపోయిన రైతు ఎల్లయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని పవన్ కల్యాణ్ కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more