కులం కూడు పెట్టదన్న సత్యం మరిచారు. సమాజం కట్టుబాట్లను తప్పిందని తమ కన్నకూతురిపైనే అత్యంత దారుణ చర్యలకు పాల్పడ్డారు. నాగరికంగా దేశం ముందుడుగు వేస్తున్నా.. ఇంకా అనాగరికంగా కులం, కట్టుబాట్లు అంటూ హూకరించారు. సమాజంలో తమ పరువు పోయిందని.. దానిని సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా యువతిని అర్థనగ్నంగా ఊరంతా ఊరేగించారు. అంతటితో ఆగకుండా ఆ యువతిని ఊరేగిస్తున్న సమయంలో పది మంది యువకులు అమెపై కర్రలతో ఎక్కడపడితే అక్కడ కొట్టారు.
సమాజం, కట్టుబాట్ల ముందు కన్నప్రేమ తలవంచడంతో ఈ దారుణం జరిగింది. ఇలాంటి అటవిక న్యాయం జరుగుతున్న నేపథ్యంలో ఆ యువతి పరువు ఏమైంది.. అమెకు పరువు మర్యాదలు లేవా.? అమె హక్కులకు భంగం వాటిల్లలేదా.? అని మానవహక్కుల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇంతకీ కన్న తల్లిదండ్రులు, తోడపుట్టినవారు అమెపై ఎందుకిలాంటి దారుణానికి పాల్పడ్డారు.. అంటే అమె తమ కులానికి చెందని యువకుడిని ప్రేమించి.. అతనితో పారిపోవడమే ఇందుకు కారణం.
దీంతో కోపంతో రగిలిపోయిన కుటుంబ సభ్యులు ఆమె కోసం వెలికారు. చివరకు అమెను మాయమాటలతో వచించారు. అంతే అక్కడి నుంచి అమెను పట్టుకొచ్చి గ్రామంలోకి తీసుకువచ్చి చితకబాదారు. అనంతరం అర్థనగ్నంగా ఊరంతా పరిగెత్తించి కొట్టారు. ఇంత జరుగుతున్నా ఈ దారుణాన్ని అపిన వారు లేరు. అయితే తమ సెల్ ఫోన్లలో మాత్రం ఈ ఘటనను బంధించారు కొందరు. మధ్యప్రదేశ్ లోని అలిరాజ్ పూర్ జిల్లాలో చోటుచేసుకుందీ ఘటన. జిల్లాలోని తమాచీ గ్రామానికి చెందిన ఓ యువతి(19) మరో తెగకు చెందిన యువకుడిని ప్రేమించింది.
అయితే తమ వివాహానికి ఇరుకుటుంబాలు ఒప్పుకోవని భావించిన ప్రేమికులు, ఇంట్లో నుంచి పారిపోయారు. దీంతో కుమార్తె చర్యతో తమ పరువు పోయిందని భావించిన అమ్మాయి కుటుంబ సభ్యులు ఎలాగో ఆమెను ఇంటికి పట్టుకొచ్చారు. అనంతరం అర్థనగ్నంగా చేసి ఇంట్లోని వాళ్లంతా ఆమెను చావబాదారు. అలాగే కొడుతూ ఊరిలోని రోడ్ల వెంట తిప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వాట్సాప్ లో వైరల్ గా మారడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, తమకు ఫిర్యాదు అందితేనే ఈ విషయంలో ముందుకెళ్లగలమని పోలీసులు స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more