గత ఏడాది కన్నెర్ర చేసిన అమ్మవారు ఈ సారి మాత్రం ప్రశాంతంగా, శాంతియుతంగా వ్యవహరించారు. రాష్ట్ర ప్రజలు కోరుకున్న కోర్కెలన్నీ తప్పక తీర్చుతానంటూ అమ్మవారు భక్తులకు భరోసా కల్పించారు. అత్యంత కన్నులపండుగగా జరిగిన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర మురసటి రోజైన ఇవాళ ఆనవాయితీ ప్రకారం ఆచరిస్తున్న రంగం కార్యక్రమంలో అమ్మవారు వెల్లడించిన భవిష్యవాణి ఇది.
మాతంగి స్వర్ణలత పచ్చికుండపై నిలబడి, అమ్మవారిని తనలోకి ఆహ్వానించుకుని రంగం కార్యక్రమం నిర్వహించగా, దీన్ని చూసేందుకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ సంవత్సరం పూజలు ఎంతో సంతృప్తికరంగా జరిగాయని, గత సంవత్సరం తాను కొంత బాధపడ్డానని, ఈ ఏడాది సిబ్బంది మంచిగా పనిచేశారని పేర్కొంది. ప్రజలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారని, ఐదు వారాలు సాకలతో, పప్పు బెల్లాలతో తనకు పూజలు జరిపించాలని కోరింది.
తన అక్కచెల్లెళ్లు దూరంగా వెళ్లకుండా, తనకు దగ్గరగానే ఉండి పూజలు జరిపించాలని సూచించింది. భవిష్యత్తులో ప్రజలకు ఎటువంటి ఆపదలూ రాకుండా చూసుకుంటానని, తనకు మారు బోనాన్ని తప్పకుండా ఇవ్వాలని అమ్మ సూచించింది. ఈ సంవత్సరం వర్షాలు బాగుంటాయని, రైతులకు మంచి పంటలు పండుతాయని, ప్రజల సంతోషమే తన సంతోషమని వెల్లడించింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి అడిగిన పలు ప్రశ్నలకు అమ్మ తరఫున స్వర్ణలత సమాధానాలిచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more