తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన యాద్రాది భువనగిరి జిల్లా హాజీపూర్ లో మర్డర్ మిస్టరీల కేసుదర్యాప్తులో మరో కలకలం రేగింది. దీంతో హాజీపూర్ గ్రామాంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నాలుగేళ్ల క్రితం తప్పిపోయిన కల్పనను కూడా సైకో రేపిస్టు కిల్లర్ శ్రీనివాస్ రెడ్డే అత్యాచారం చేసిన అంతమెందించాడని అంగీకరించాడు. ఈ మేరకు పోలీసుల దర్యాప్తులో మరో నిజం బయటకు రావడం.. కల్పన శవం కూడా పక్కనున్న మరో బావిలో లభ్యమైంది. దీంతో ఇప్పటివరకు ఈ సైకో బారినపడి బలైన బాలికల సంఖ్య మూడుకి చేరింది.
ఈ వార్త వెలుగులోకి రావడంతో.. గ్రామస్థుల్లో అవేశం కట్టలు తెంచుకుంది. గ్రామస్థులు నిందితుడి ఇంటికి నిప్పుపెట్టారు. అభంశుభం తెలియని అమాయక చిన్నారులపై అత్యాచారానికి పాల్పడి.. వారిని బావుల్లో పూడ్చిపెట్టిన మానవమృగంగా మారిన శ్రీనివాస్ రెడ్డిని వెంటనే ఎన్ కౌంటర్ చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. అతని ఇంటిని ధ్వంసం చేయడానికి వెళ్లిన గ్రామస్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంతమంది గ్రామాస్థులు వెనుకగా వచ్చి నిందితుడి ఇంటికి నిప్పుపెట్టారు.
పదో తరగతి విద్యార్థిని శ్రావణి, ఇంటర్ విద్యార్థిని మనీషాలతో పాటు నాలుగేళ్ల క్రితం హాజీపూర్ లోని మేనత్త ఇంటికి వచ్చి.. కనిపించకుండాపోయిన కల్పనను కూడా ఈ పైశాచిక మృగమే హతమార్చింది. లిఫ్ట్ పేరుతో అమ్మాయిలను బైక్ పై ఎక్కించుకుని వారిపై దారుణాలకు పాల్పడినట్టు శ్రీనివాస్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. అమ్మాయిల హత్యలు గ్రామస్తులను ఉలిక్కిపడేలా చేశాయి. ఈ ఘటనలను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీనివాస్ రెడ్డిపై గ్రామస్తులు కోపంగా ఉన్నారు.
ఈ ఆవేశంలో అతడి ఇంటిపై దాడి చేశారు. ఇంటిపై దాడి దృశ్యాలను కవర్ చెయ్యకుండా మీడియా ప్రతినిధులను గ్రామస్తులు అడ్డుకున్నారు. మీడియా వారికి సంబంధించిన కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి ఆస్తులను ధ్వంసం చేసి తీరుతామన్నారు. ఈ ఘటనతో అలర్ట్ అయిన పోలీసు ఉన్నతాధికారులు.. అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. కాగా, శ్రీనివాస్ రెడ్డి నేరచరిత్రను తెలుసుకునేందుకు ఖాకీలు కూపీ లాగుతున్నారు. ఇన్ని హత్యలు ఒక్కడే చేశాడా? ఇంకెవరైనా సాయం చేశారా అనేదానిపై ఆరా తీస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more