Missing Girl Kalpana Body Found In Another Well కల్పననూ కాలరాసిందీ వాడే.. సైకో రేపిస్ట్ ఇంటికి నిప్పు.. ఉద్రిక్తత

Yadadri murder psycho rapist killer srinivas reddy house set afire by angry villagers

Yadadri murder case, srinivas reddy house set afire, Kalpana rape, kalpana missing, kalpana dead body, kalpana skelton, manisha murder, manisha dead body, manisha skeleton, sravani murder, sravani dead body, sravani rape and murder, srinivas reddy, bike mechanic, hazipur, bommalaramaram, yadadri district, crime

In a shocking development, the Rachakonda Police found another dead body of a girl from another well, who was later identified as Kalpana, who went missing four years ago.

ITEMVIDEOS: కల్పననూ కాలరాసిన కీచకుడు వాడే.. సైకో ఇంటికి నిప్పు.. ఉద్రిక్తత

Posted: 04/30/2019 01:31 PM IST
Yadadri murder psycho rapist killer srinivas reddy house set afire by angry villagers

తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన యాద్రాది భువనగిరి జిల్లా హాజీపూర్ లో మర్డర్ మిస్టరీల కేసుదర్యాప్తులో మరో కలకలం రేగింది. దీంతో హాజీపూర్ గ్రామాంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నాలుగేళ్ల క్రితం తప్పిపోయిన కల్పనను కూడా సైకో రేపిస్టు కిల్లర్ శ్రీనివాస్ రెడ్డే అత్యాచారం చేసిన అంతమెందించాడని అంగీకరించాడు. ఈ మేరకు పోలీసుల దర్యాప్తులో మరో నిజం బయటకు రావడం.. కల్పన శవం కూడా పక్కనున్న మరో బావిలో లభ్యమైంది. దీంతో ఇప్పటివరకు ఈ సైకో బారినపడి బలైన బాలికల సంఖ్య మూడుకి చేరింది.

ఈ వార్త వెలుగులోకి రావడంతో.. గ్రామస్థుల్లో అవేశం కట్టలు తెంచుకుంది. గ్రామస్థులు నిందితుడి ఇంటికి నిప్పుపెట్టారు. అభంశుభం తెలియని అమాయక చిన్నారులపై అత్యాచారానికి పాల్పడి.. వారిని బావుల్లో పూడ్చిపెట్టిన మానవమృగంగా మారిన శ్రీనివాస్ రెడ్డిని వెంటనే ఎన్ కౌంటర్ చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. అతని ఇంటిని ధ్వంసం చేయడానికి వెళ్లిన గ్రామస్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంతమంది గ్రామాస్థులు వెనుకగా వచ్చి నిందితుడి ఇంటికి నిప్పుపెట్టారు.

పదో తరగతి విద్యార్థిని శ్రావణి, ఇంటర్ విద్యార్థిని మనీషాలతో పాటు నాలుగేళ్ల క్రితం హాజీపూర్ లోని మేనత్త ఇంటికి వచ్చి.. కనిపించకుండాపోయిన కల్పనను కూడా ఈ పైశాచిక మృగమే హతమార్చింది. లిఫ్ట్ పేరుతో అమ్మాయిలను బైక్ పై ఎక్కించుకుని వారిపై దారుణాలకు పాల్పడినట్టు శ్రీనివాస్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. అమ్మాయిల హత్యలు గ్రామస్తులను ఉలిక్కిపడేలా చేశాయి. ఈ ఘటనలను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీనివాస్ రెడ్డిపై గ్రామస్తులు కోపంగా ఉన్నారు.

ఈ ఆవేశంలో అతడి ఇంటిపై దాడి చేశారు. ఇంటిపై దాడి దృశ్యాలను కవర్ చెయ్యకుండా మీడియా ప్రతినిధులను గ్రామస్తులు అడ్డుకున్నారు. మీడియా వారికి సంబంధించిన కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి ఆస్తులను ధ్వంసం చేసి తీరుతామన్నారు. ఈ ఘటనతో అలర్ట్ అయిన పోలీసు ఉన్నతాధికారులు.. అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. కాగా, శ్రీనివాస్ రెడ్డి నేరచరిత్రను తెలుసుకునేందుకు ఖాకీలు కూపీ లాగుతున్నారు. ఇన్ని హత్యలు ఒక్కడే చేశాడా? ఇంకెవరైనా సాయం చేశారా అనేదానిపై ఆరా తీస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sravani  manisha  Kalpana  srinivas reddy  bike mechanic  keesara  hazipur  bommalaramaram  yadadri district  crime  

Other Articles