నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న మెగా బ్రదర్ నాగబాబు తన ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు కూడా ధీటుగా, ఘాటుగా సమాధానం చెబుతున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు తనను 'నాన్ లోకల్' అంటూ తేలిగ్గా తీసిపారేయడంపై నాగబాబు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రజాసేవ చేసేందుకు వచ్చిన తాను లోకల్ అని.. కేవలం ఎన్నికల సమయంలో ప్రజలకు కనిపించి.. అవి ముగియగానే ఎక్కడో ఏసీ గదుల్లో కూర్చోని బెట్టింగ్ లు కాసే పందెంరాయుళ్లే నాన్ లోకల్ అని ఘాటుగా సమాధానమిచ్చారు.
ఎన్నికలు ముగిసిన తరువాత అడ్రస్ కూడా కనిపించకుండా పోయే కుహానా రాజకీయ నాయకుణ్ణి తాను కాదని అన్నారు. తాను లోకల్ అని తన విద్యాబ్యాసం జరిగింది నర్సాపురంలోనేనని ఆయన చెప్పారు. అయినా తనను నాన్ లోకల్? అని విమర్శించేవారికి తన గురించి ఏం తెలుసునని ప్రశ్నించారు. తాను పుట్టింది మొగల్తూరులో అయినా హైస్కూల్ నుంచి కాలేజ్ వరకు నరసాపురంలోనే చదివానని అన్నారు. తన సతీమణి కూడా పశ్చిమ గోదావరి జిల్లానేనని చెప్పకోచ్చారు.
పశ్చిమ గోదావరి జిల్లా అంతా తిరిగానని. తమ నాన్నది కూడా పెనుగొండేనని. ఇవన్నీ తెలుసుకోకుండా చౌకబారు విమర్శలు చేస్తున్నారని ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ‘‘ఎవడా సన్నాసి నన్ను నాన్ లోకల్ అన్నది? ఇంతకంటే పనికిమాలినతనం మరొకటి ఉంటుందా? నాపై పోటీచేస్తున్న రఘురామ కృష్ణంరాజు ఏమన్నా లోకల్ అభ్యర్థా?’’ అంటూ ప్రశ్నించారు. చోక్కాలు మార్చినంత తేలిగ్గా పార్టీ మారుతున్న ఈ నేతలు తనను విమర్శిస్తారా.? అంటూ ఫైర్ అయ్యారు.
పండుగలు, పబ్బాలు వస్తే బెట్టింగ్ బంగార్రాజులా వ్యవహారాలు చేసే సిగ్గులేనివాళ్లు.. పరిశ్రమల పేరుతో వందల కోట్ల రూపాయలు ముంచి బ్యాంకులను దివాళా తీసిన ఘనులకు తనను విమర్శించే నైతికత వుందా.? అంటూ ప్రశ్నించారు. అసలైన లోకల్ అభ్యర్థిని తానేనని, ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయడానికే వచ్చానని చెప్పారు. తనలా ఎవరు వచ్చినా.. ఎక్కడి నుంచి వచ్చినా వాళ్లు లోకల్ వ్యక్తులనే నాగబాబు వ్యాఖ్యానించారు. తనను నాన్ లోకల్ అనే రాస్కెల్స్ కంటే తానే మేలు అని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more