ఎన్నికల కోడ్ అమల్లో వుండగా, మీరట్ నుంచి క్రితం రోజున తన ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోడీ.. దేశమంతా చౌకీదార్ అంటూ.. చౌకీదార్ పదానికి వన్నెతెస్తున్న తరుణంలో ఆయన కాపలా వుండగానే పెద్ద తప్పిదం జరిగింది. ఏకంగా రైల్వే శాఖకు చెందిన పర్యాటక విభాగం ఐఆర్సీటీసీ ఇందుకు కారణమైంది. కాపలాదారు ప్రచారం మెదలుపెట్టిన రెండో రోజునే ఇలాంటి తప్పదం ఎలా జరిగిందా.? అంటూ రంగంలోకి దిగారు కేంద్ర ఎన్నికల అధికారులు.
ఎన్నికల సిత్రాలలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఏ పని చేయడానికైనా వెనక్కి తగ్గిన నేతలు.. ఎన్నో ప్రయత్నాలు చేసి నెపాన్ని మాత్రం మరోకరిపై వేసి తప్పించుకోవడం పరిపాటే. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడుతూ దొరికితేనే పక్కనోడిని దొంగను చేసి తప్పించుకునే పాలసీని ఫాలో అవుతుంటారు.
సరిగ్గా ఇక్కడ జరిగింది కూడా అదే. అందివచ్చింది కదా అని చిఖరికి తాగే టీ కప్పులను కూడా వదలడం లేదు. పేపర్ టీ కప్పులపై కూడా మై బీ చౌకీదార్ అనే నినాదంతో ఎన్నికల ప్రచారానికి తెరతీశారు. రైల్వే బోర్డులో జరిగిన తప్పిదంతో ఎన్నికల మోడల్ కోడ్ ఉల్లంఘనకు గురైంది.
ఈ క్రమంలో చౌకీదార్ పేరుతో రైల్లో పేపర్ టీ కప్పులు దర్శనమిచ్చాయి. ఖోత్ గూదాంకు వెళ్తున్న శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైల్లో సర్వ్ చేసిన చౌకీదార్ టీ కప్పును ఓ ప్రయాణికుడు ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. పేపర్ కప్ పై .. నేను కూడా చౌకీదార్ నే అని హిందీలో రాసి ఉంది. ఈ వైరల్ ఫొటోపై స్పందించిన రైల్వేబోర్డు వెంటనే పేపర్ కప్స్ కంట్రాక్ట్ ను రద్దు చేసుకున్నట్టు ప్రకటించింది. సదరు కంట్రాక్టర్ కు భారీ జరిమానా విధించింది.
Tea being sold in 'Main Bhi Chowkidar' (I am also a watchman) paper cups in Indian Railways. This photo is from Shatabdi Express.
— Uzair Hasan Rizvi (@RizviUzair) March 29, 2019
Does this violate model code of conduct? @SpokespersonECI pic.twitter.com/WQF3RiXzke
పేపర్ కప్ పై ప్రకటన ఇచ్చింది సంకల్ప్ ఫౌండేషన్ కు చెందిన ఓ ఎన్జీవో సంస్థగా తెలుస్తోంది. టీ కప్పులపై మెయిన్ భీ చౌకీదార్ అని హిందీ అక్షరాల్లో రాసి ఉన్నట్టు విచారణలో వెల్లడైంది. టీ కప్పులపై చౌకీదార్ పేరుతో సర్వ్ చేయడానికి ఐఆర్సీటీసీ నుంచి ఎలాంటి ఆమోదం లేదని, వెంటనే ఈ తప్పిదానికి రైల్వే సూపర్ వైజర్, అధికారులు వివరణ ఇచ్చుకున్నారు. పేపర్ టీ కప్పులను అందించే సర్వీసు ప్రొవైడర్ కు రూ.లక్ష వరకు జరిమానా విధించారు. క్రమశిక్షణ చర్యల కింద సదరు సర్వీసు ప్రొవైడర్ కు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్టు ఐఆర్సీటీసీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
రైల్వేలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఘటన జరగడం ఇది రెండోసారి. ఇటీవల రైల్వే టికెట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫొటోలు దర్శనమివ్వడంతో తృణమూల్ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రైల్వే బోర్డు ప్రయాణికులకు జారీ చేసే టికెట్లను విత్ డ్రా చేసుకుంది. దీనిపై రైల్వే స్పందిస్తూ.. ఉద్దేశపూర్వకంగా చేసిందికాదని, అనుకోకుండా జరిగిన తప్పిదంగా వివరణ ఇచ్చుకుంది. మరోవైపు రైల్వే నిర్వాకంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more