తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనానికి తెరలేచింది. కేసీఆర్ను ఓడించడమే లక్ష్యమని పదేపదే ప్రకటించిన కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గజ్వేల్లో కేసీఆర్పై పోటీ చేసి ఓడిపోయిన వంటేరు పత్రాప్ రెడ్డి రేపు (జనవరి 18) సాయంత్రం గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు బద్దశత్రువు అని ప్రకటించిన వంటేరు.. ఇప్పుడు ఆయన సమక్షంలోనే అధికారికంగా టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.
టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వలసవచ్చిన ఆయన.. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిముగియగానే మరోమారు వలసవెళ్లనున్నారు. తన రాజకీయ జీవితం కోసం వున్న అస్తులన్నీ అమ్ముకున్న ఆయన.. ఇటీవల ఎన్నికలలో కూడా ఓటమిపాలు కావడంతో తనకు రాజకీయ జీవితం కావాలంటే ఇక గెలిచే శత్రువునే అశ్రయించాలని సిద్దాంతాన్ని ఫాలో అవుతున్నారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వంటేరు ప్రతాపరెడ్డి గజ్వేల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్పై పోటీ చేసి 56 వేల ఓట్లతో ఓటమిపాలయ్యారు.
డిసెంబర్ 7న జరిగిన ఎన్నికల తరువాత సరిగ్గా నెల రోజుల వ్యవధి తరువాత తన దోరణి మార్చుకున్న వంటేరు.. గులాబీ పార్టీలో చేరతున్నారన్న వార్తలు సంచలనంగా మారాయి. ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు.. వంటేరు ప్రతాప రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు ముఖ్య అనుచరులు టీఆర్ఎస్లో చేరనున్నారు. దీనికి సంబంధించి ఆయన తన అనుచరులు, అభిమానులతో ఇప్పటికే మాట్లాడినట్లు సమాచారం. కేసీఆర్, హరీశ్ రావుతోనూ మాట్లాడినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more