ఇంటర్ విద్యార్థినిపై తండ్రి వయస్సులో వున్న వ్యక్తి మరో ఎనమిది మందితో కలసి దారుణానికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. తన జన్మదినం వారం రోజుల కిందటే జరిగిందని, అందుకు గాను తాను పార్టీ ఇస్తున్నానని మాయమాటలు చెప్పి.. విద్యార్థిని తన ఇంటికి పిలుపించుకుని మద్యం తాగించి.. అమె మత్తులోకి జారుకున్న తరువాత తొమ్మిది మంది మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు కథనం ప్రకారం... గిద్దలూరు మండల నరవ గ్రామానికి చెందిన ఓ కుటుంబం పట్టణంలో నివాసం ఉంటోంది. ఈ కుటుంబానికి చెందిన మైనర్ బాలిక (17) స్థానిక కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆ బాలికపై తండ్రి వయస్సులో వున్న మాజీ సైనిక ఉద్యోగి సురేంద్ర(45) కన్నుపడింది. ఆమె మానసిక లోపాన్ని ఆసరాగా చేసుకున్న సురేంద్ర బాలికను మాయమాటలతో మభ్యపెట్టాడు. బాధితురాలని ఇంటికి తీసుకెళ్లి మద్యం అలవాటు చేశాడు.
ఇక ఇటీవల వారం రోజుల కిందట తన పుట్టిన రోజు ఉందని చెప్పి, బాలికను ఇంటికి రప్పించాడు. అక్కడ ఆమెతో మద్యం తాగించి, మత్తులోకి జారుకున్న తర్వాత మరో ఎనిమిది మందితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన తర్వాతి నుంచి ఆ విద్యార్ధిని ఒంటరిగా తనలో తానే కుమిలిపోయింది. ముభావంగా ఉంటూ ఎవరితోనూ మాట్లాడకపోవడం, దీన్ని ఆసరగా తీసుకుని మరి కొందరు ఆమెను లొంగదీసుకుని తమ కోర్కె తీర్చుకున్నారు. బాలిక పరిస్థతిని గమనించిన తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో అసలు విషయం వెల్లడించింది.
దీంతో, తల్లిదండ్రులు ఆదివారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక సీఐ శ్రీరాంను కలిసి జరిగిన విషయం తెలియజేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, మిగతావారి కోసం గాలిస్తున్నారు. బాలికకు జరిపిన వైద్య పరీక్షల్లో ఆమెపై అత్యాచారం జరిగినట్టు నిర్దరణ అయ్యింది. నిందితుల్లో ఆమె చదువుతోన్న కాలేజీ విద్యార్థి కూడా ఒకరు ఉన్నట్లు సమాచారం. దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడవుతాయని, మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more