ప్రముఖ యోగా గురు, స్వయం ప్రకటిత దైవాంశసంభూతుడిగా వెలుగొందుతున్న బాబా రాందేవ్ కు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రముఖ పుస్తక ప్రచురణ సంస్థ జుగ్గెర్నాట్.. బాబా రాందేవ్ పై ప్రచురించనున్న పుస్తకాన్ని నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టు సహా కిందికోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ దేశఅత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో పిటీషన్ ను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం బాబా రాందేవ్ కు నోటీసులు పంపింది.
వివరాల్లోకి వెళ్తే, జుగ్గెర్నాట్ బుక్స్ అనే సంస్థ బాబా రాందేవ్ జీవితంపై 'గాడ్ మ్యాన్ టు టైకూన్' పేరుతో పుస్తకాన్ని రూపొందించింది. స్వయం ప్రకటిత దైవాంశ సంభూతుడు నుంచి వ్యాపార దిగ్గజంగా మారిన ఆయన జీవిత విశేషాలను ఈ పుస్తకంలో పొందుపర్చనుంది. అయితే, ఈ పుస్తకంలో తన ప్రతిష్టకు భంగం కలిగించే అంశాలున్నాయని... తన గౌరవానికి, ఆర్థిక ప్రయోజనాలకు ఇవి భంగం కలిగిస్తాయని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టును రాందేవ్ ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో ఈ పుస్తకాన్ని ప్రచురించడం, విక్రయించడం చేయరాదని గత నెల 29న హైకోర్టు ఆదేశించింది. దీంతో, ప్రచురణకర్తలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు రాందేవ్ బాబాకు నోటీసులు జారీ చేస్తామని తెలిపింది. అయితే పిటీషనర్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఇంటర్ నెట్ సంస్థలను కూడా చేర్చడంతో ఆయా సంస్థలకు నోటీసులు అందజేయాల్సిన అవసరం లేదని తెలిపిన జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ సుప్రీంకోర్టు ధర్మాసనంతదుపరి విచారణను ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more