కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అత్యంత నీతి, నిజాయితీగా, ఎలాంటి రాజకీయ అపేక్ష లేకుండా పాలనను అందిస్తుందని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ తెలంగాణ వచ్చి తమ ప్రభుత్వ గోప్పలు చెప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రభుత్వ నిజాయితీ, నిబద్దత, రాజకీయ అపేక్ష ఎలాంటిదో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇవాళ రట్టు చేశారు. కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం తనపై ఎలాంటి ఒత్తడి చేసిందో ఆయన వివరించారు.
ఇప్పటికే మోదీ ప్రభుత్వం దేశంలోని అన్ని వ్యవస్థలను తన అధీనంలోకి తీసుకుని వాటిపై తమ అధిపత్యం చెలాయిస్తుందని విపక్షాలు అరోపణలు చేస్తున్నాయి. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా తొలిసారిగా మీడియా ముందుకు వచ్చి.. ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచివుందని అరోపణలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక స్వయం ప్రతిపత్తి సంస్థలు ఆదాయపన్ను శాఖ, సీబిఐ, ఈడీలను కూడా కేంద్రం ప్రభావితం చేసి అధిపత్యం చేలాయిస్తుందని పత్రిపక్షాలు విమర్శిస్తున్నాయి.
అయితే తాజాగా కేంద్రప్రభుత్వం ఎంతటి ఒత్తిడులను తీసుకువస్తుందో స్పష్టంగా తెలియజేశారు జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీని ఉన్నపళంగా రద్దు చేసి సంచలనం సృష్టించిన ఆయన.. తాజాగా మరోసారి ప్రకంపనలు పుట్టించారు. తాను అసెంబ్లీని రద్దు చేసే ముందు తనపై కేంద్రం ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిని తీసుకువచ్చిందని ఆయన చెప్పారు. ఆ రోజు తాను ఎలాంటి ఒత్తిళ్లకు లొంగలేదని కూడా ఆయన స్పష్టం చేశారు.
మహబూబా ముఫ్తీ ప్రభుత్వాన్ని జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ నుంచి పంపించి.. ఆ స్థానంలో సజ్జాద్ లోన్ ను ముఖ్యమంత్రిగా నియమించాలంటూ తనపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చిన విషయం నిజమేనని ఆయన కుండబద్దలు కొట్టారు. కేంద్ర ఒత్తిడికి తాను లొంగిలేదని.. అందుకనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సజ్జాద్ ను తాను ఆహ్వానించలేదని చెప్పారు. కేంద్రం ఒత్తడికి తాను లొంగి ఉంటే... నిజాయతీ లేని వ్యక్తిగా తాను చరిత్రలో నిలబడాల్సి వచ్చేదని అన్నారు. తనపై వస్తున్న విమర్శలపై తాను బాధపడటం లేదని సత్యపాల్ చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more