నెల ప్రారంభంలో జీతం పడిందంటే చాలు... డబ్బులొచ్చే ఏటీఎంను వెతుక్కుంటూ పరుగెడతాం. డబ్బులు వస్తున్నాయంటే చాలు సంతోషంతో గంటసేపైనా సరే క్యూలో నిల్చొని ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేసుకుంటాం. నోట్ల రద్దు తర్వాత ఏటీఎంల వద్ద నిల్చున్న జనాలను చూసి ప్రపంచమే షాక్ గురైంది. అయితే దాన్ని ఎలాగోలా తట్టుకున్న భారతీయులకు ఇప్పుడు మరోక గట్టి షాక్ తగలనుంది. దేశంలో ఉన్న సగం ఏటీఎంలు త్వరలో మూతబడబోతున్నాయి. మెల్లిమెల్లిగా ఏటీఎంలు మూసివేస్తూ వస్తున్న బ్యాంకులు... వచ్చే ఏడాది మార్చి నాటికల్లా సగం ఏటీఎంలను ఎత్తివేయబోతున్నాయి.
బ్యాంకింగ్ చట్టంలో వచ్చిన మార్పులు, ప్రభుత్వరంగ బ్యాంకులు ఎదుర్కొంటున్న నష్టాల కారణంగా ఏటీఎంల నిర్వహణ భారంగా మారింది. అదీగాక బ్యాంకింగ్ కార్యకలాపాల్లో పటిష్ట నియంత్రణ తీసుకురావాలనే ఆలోచన సైతం ఉంది. ఇందులో భాగంగా లెక్కకు మించి ఉన్న ఏటీఎంలను వీలైనంత త్వరగా మూసివేయాలని నిర్ణయించింది కాన్ఫడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ. ఒకేసారి భారీ సంఖ్యలో ఏటీఎంలను మూసివేస్తే ఆ ప్రభావం లక్షల మందిపై పడే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఏటీఎంల దగ్గర పనిచేసే సెక్యూరిటీ గార్డ్స్ నిరుద్యోగులవుతారు. అదీగాక డిజిటల్ కార్యకలాపాలు పెంచాలనుకుంటున్న ప్రభుత్వ ఆలోచనలకు బ్రేక్ పడుతుంది. అయినా వచ్చే ఏడాది మార్చినాటి కల్లా దేశవ్యాప్తంగా దాదాపు ఒక లక్షా 13 వేల ఏటీెంలను సర్వీస్ ప్రొవైడర్లు బలవంతంగా మూసివేయాల్సి రావచ్చని ఏటీఎం ఇండస్ట్రీ ఓ ప్రకటనలో పేర్కొంది. వీటిలో లక్ష ఏటీఎంలు ఊరికి దూరంగా, మారుమూల పల్లెల్లో ఉన్న ఏటీఎంలే ఉండడం విశేషం.
వీటిని మూసివేస్తే ప్రభుత్వ సబ్సిడీలను తీసుకునే గ్రామప్రజలు ఇబ్బందుల్లో పడతారు. కొత్త కరెన్సీ నోట్ల కారణంగా ఏటీఎం మెషిన్లలో హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేయడం, క్యాష్ లోడింగ్కు అనుసరిస్తున్న క్యాసెట్ స్వాపింగ్ పద్ధతి కూడా మార్చాల్సిరావడంతో ఖర్చు భారీగా పెరిగిపోయిందట. కొత్త టెక్నాలజీ అప్గ్రేడ్ చేసేందుకే రూ. 3 వేల కోట్లు అదనంగా ఖర్చవుతోందని అంచనా వేసింది సీఏఏఐ.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more