గత ఎన్నికలలో టీడీపీ తరుపున ఫోటీ చేసి ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అర్.కృష్ణయ్య ఈ సారి న్నికలలో కాంగ్రెస్ ఖండువా కప్పుకున్న క్షణాల్లో ఆయనను కాంగ్రెస్ టిక్కెట్ వరించింది. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తన సర్వశక్తులోడ్డి తన కుమారుడికి ఎన్నికల బరిలో దింపేందుకు తుదివరకు ప్రయత్నాలు చేసినా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం అదే సీటును అర్ కృష్ణయ్యకు కేటాయించి అనూహ్య నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
కృష్ణయ్యతో కాంగ్రెస్ గేమ్స్..
కాంగ్రెస్ పార్టీలో తాను చేరడానికి సమ్మతిస్తూనే.. ఇటీవల కాంగ్రెస్ జాబితాలను చూసిన బిసి నేత అర్ కృష్ణయ్య.. కాంగ్రెస్ బిసీలకు అన్యాయం చేస్తుందని, తాను డిమాండ్ చేసిన సంఖ్యలో బిసిలకు టికెట్లు కేటాయించలేదని విమర్శించారు. ఈ క్రమంలో ఈ నెల 17న తెలంగాణ బంద్ కు కూడా పిలుపునిచ్చారు. అయితే చివరి క్షణంలో బంద్ ను నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న కృష్ణయ్యకు కాంగ్రెస్ నుంచి హామీ లభించిందని.. ఈ క్రమంలో బిసిలకు న్యాయం చేస్తామని కూడా పార్టీ నేతలు హామి ఇచ్చారని సమాచారం.
అయితే అర్ కృష్ణయ్యకు బిసిలకు న్యాయ చేస్తామన్న హామీతో పాటు టికెట్ కూడా కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీంతో బిసిలను తమవైపుకు అకర్షించు కోవచ్చని భావించింది. అదే సమయంలో అర్ కృష్ణయ్యతో బిసి కార్డుకు చెక్ పెట్టాలని కూడా భావించిందా.? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఓ వైపు జానారెడ్డికి మంచి పట్టున్న స్తానంలో కృష్ణయ్యకు సీటును కేటాయించడం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.
దీంతో ఆయన కృష్ణయ్యకు మద్దతు ఇస్తారా.? అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక అదే స్థానం నుంచి ప్రజాకూటమిలోని మిత్రపక్షమైన టీజేఎస్ కూడా తమ అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించడం.. ఈ క్రమంలో అక్కడ స్నేహపూర్వక పోటీ ఏర్పడింది. దీంతో ఓట్లు చీలడంతో ఎవరి లబ్ది చేకూరుతుందన్న విషయాన్ని పక్కడబెడితే.. కృష్ణయ్యకు మాత్రం మిర్యాలగూడ నల్లేరు మీద నడకకాదని బిసి కాంగ్రెస్ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
కృష్ణయ్యకు టికెట్ కేటాయింపుపై రుసరుసలు
ఆర్.కృష్ణయ్యకు కాంగ్రెస్ తుదిజాబితాలో చోటు దక్కడంపై ఇటు కాంగ్రెస్, అటు మహాకూటమి నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో చేరకుండానే ఆయనకు మిర్యాలగూడ టికెట్ కేటాయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్న పలువరు కాంగ్రెస్ సీనియర్ నేతలు, టికెట్ల అశావహులు తెలంగాణ నాయకత్వంపై రుసరుసలు అడుతున్నారు. మిర్యాలగూడ టికెట్ను తన బంధువుకు ఇప్పించుకునేందుకు సీనియర్ నేత జానారెడ్డి విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆశావహులకు మొండిచెయ్యి చూపిన అధిష్ఠానం పార్టీలో చేరని వారికి టికెట్ ఇవ్వడమేంటని నేతలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more