ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే గాంధీ కుటుంబం బయటి వ్యక్తికి ఐదేళ్ల పాటు పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టగలదా.. అని ప్రధాని నరేంద్ర మోదీ అడిగిన ప్రశ్నపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం స్పందించారు. నిన్న మోదీ ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్లో నిర్వహించిన ప్రచార సభలో మాట్లాడుతూ పై విధంగా ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన చిదంబరం గాంధీ కుటుంబంలోని వారు కాకుండా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా పనిచేసిన వారి జాబితాను ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఇక మోదీ ఆయన హయాంలోని రఫేల్ ఒప్పందం, నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యల పై మాట్లాడాలని కోరారు.
1947 నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా చాలా మంది బయటి వ్యక్తులు పనిచేశారని చిదంబరం పేర్కొన్నారు. ఆచార్య కృపలానీ, పట్టాభి సీతారామయ్య, పురుషోత్తందాస్ టాండన్, యూఎన్ ధేబర్, నీలం సంజీవ రెడ్డి, కామరాజ్, నిజలింగప్ప, జగజ్జీవన్ రామ్, శంకర్ దయాళ్ శర్మ, దేవకాంత బరూవా, బ్రహ్మానంద రెడ్డి, పీవీ నరసింహారావు, సీతారాం కేసరిల పేర్లను ఆయన ట్వీట్ చేశారు. అంతేకాకుండా స్వాతంత్ర్యానికి ముందు నుంచి ఎంతో మంది గొప్ప నేతలు కాంగ్రెస్లో ఉన్నారని, అందుకు తాము గర్వపడుతున్నామని పేర్కొన్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్, లాల్ బహదూర్ శాస్త్రి, కె. కామరాజ్, మన్మోహన్ సింగ్ ఇలా ఎంతో మంది నేతలు దేశం కోసం కృషి చేశారని తెలిపారు.
ప్రధాని మోదీ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎవరు ఎన్నికయ్యారనే విషయంపై అంత సమయం వెచ్చించి మాట్లాడం తమకు గొప్పగా ఉందని చిదంబరం పేర్కొన్నారు. అందులో సగం సమయం పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, రఫేల్, సీబీఐ, ఆర్బీఐల గురించి మాట్లాడడానికి కేటాయిస్తారా అని ఎద్దేవా చేశారు. రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగిత, మూకదాడులు, అత్యాచారాలు, ఉగ్రదాడులు తదితర అంశాలపై మోదీ మాట్లాడుతారా అని చిదంబరం సవాలు చేశారు.
To jog PM Modi’s memory: among the Congress Presidents since 1947 were Acharya Kripalani,Pattabhi Sitaramayya,Purushottamdas Tandon,U N Dhebar,Sanjiva Reddy,Sanjivaiah,
— P. Chidambaram (@PChidambaram_IN) November 17, 2018
To jog PM Modi’s memory: among the Congress Presidents since 1947 were Acharya Kripalani,Pattabhi Sitaramayya,Purushottamdas Tandon,U N Dhebar,Sanjiva Reddy,Sanjivaiah,
— P. Chidambaram (@PChidambaram_IN) November 17, 2018
To jog PM Modi’s memory: among the Congress Presidents since 1947 were Acharya Kripalani,Pattabhi Sitaramayya,Purushottamdas Tandon,U N Dhebar,Sanjiva Reddy,Sanjivaiah,
— P. Chidambaram (@PChidambaram_IN) November 17, 2018
Will PM Modi speak about farmers’ suicides, massive unemployment, lynchings, rape crimes against women and children, anti-Romeo squads, gau rakshak vigilantism and increasing terror attacks?
— P. Chidambaram (@PChidambaram_IN) November 17, 2018
We are proud of the humble origins of our post-Independence leaders like Babasaheb Ambedkar, Lal Bahadur Shastri, Kamaraj, Dr Manmohan Singh and many others. Pre-Independence, there were thousands like them.
— P. Chidambaram (@PChidambaram_IN) November 17, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more