టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, ఉమ్మడి అంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి ఆరోగ్యం విషమించింది. ప్రస్తుతం అసుపత్రిలో చికిత్స పొందుతున్న అమె.. అరోగ్యం మరింతగా విషమించిందని వైద్యులు తెలిపారు. అమెకు చికిత్స చేస్తున్న అందుకు ఆమె శరీరం స్పందించడం లేదని వైద్యులు తెలిపారు. దీంతో ఆమెను హైదరాబాద్ కు తరలించాలని నిర్ణయించారు. ఆమె శరీరంలో ప్లేట్లెట్లు పడిపోయాయని, రక్తం ఎక్కిస్తుంటే ఇన్ఫెక్షన్లు వస్తున్నట్టు వైద్యులు తెలిపారు.
గుండెపోటుతో ఈ నెల 26న విశాఖపట్టణంలోని పినాకిల్ ఆసుపత్రిలో చేరిన ఆమె రక్తంలోని ప్లేట్లెట్లు క్రితం రోజు రాత్రికి 60 వేలకు పడిపోయాయి. హిమోగ్లోబిన్ శాతం కూడా చాలా తక్కువగా ఉంది. దీంతో ఆమెకు రక్తం ఎక్కించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదని పినాకిల్ అస్పత్రి వైద్యులు తెలిపారు. అయితే అమె శరీరంలోకి రక్తం ఎక్కిస్తుండగా.. ఇన్ఫెక్షన్లు తలెత్తుతుండడంతో వైద్యులు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
మరోవైపు అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రతిభా భారతి తండ్రి జస్టిస్ పున్నయ్య ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అనారోగ్యంతో అస్పత్రిలో చేరి చికిత్స పోందిన ఆయన క్రమంగా కొలుకుంటున్నారని కూడా వైద్యులు తెలిపారు. ఆయనను చూసేందుకని వచ్చిన ప్రతిభాభారతి ఒక్కసారిగా అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రతిభా భారతిని మంత్రి కళావెంకట్రావు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ తదితరులు పరామర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more