అంధ్రప్రదేశ్ లో అగ్రిగోల్డ్ తరహా మరో మోసం తాజాగా వెలుగుచూసింది. ప్రజలకు అరచేతిలో వైకుంఠాన్ని చూపి.. అధిక వడ్డీ ఆశను ఎరగా వేసి.. జనం నుంచి వేల కోట్లు దోచేసిన మరో సంస్థ భాగోతాన్ని పోలీసులు బయటపెట్టారు. చిట్టీలు, ఎక్కువ వడ్డీ చెల్లిస్తామంటూ జనాలను మభ్యపెట్టి దేశవ్యాప్తంగా వందల కోట్లు కొట్టేసిన హీరా గోల్డ్ సంస్థ ఛైర్మన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరేళ్ల కిందట హైదరాబాద్లోని ఆ సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న హీరా గోల్డ్ ఛైర్మన్ షేక్ అలీమియా నౌహీరా బేగంను సీసీఎస్ పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను హైదరాబాద్ కు తరలించారు. దేశవ్యాప్తంగా వందల కోట్లు డిపాజిట్లు సేకరించి ఎగ్గొట్టిన ఈ సంస్థపై హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు, ముంబైలతో పాటు పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. మొత్తం 16 కంపెనీల పేర్లతో డిపాజిట్లు సేకరించి, భారీ మోసానికి పాల్పడినట్టు గుర్తించిన పోలీసులు.. 160 బ్యాంకుల్లోని ఖాతాల ద్వారా ఈ లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ డిపాజిట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 1999లోని సెక్షన్ 406, 409, 420, 506 కింద కేసులు నమోదు చేశారు. తొలిసారిగా 2012లో కేసు నమోదయ్యిందని.. నిదితురాలిపై కర్ణాటకలో పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అలాగే చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని హీరా ఇస్లామిక్ సంస్థలోనూ సీసీఎస్ పోలీసులు, సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. రాజకీయాల్లోకి వచ్చి ఆల్ ఇండియా మహిళా సాధికారికత పార్టీ పేరు రాజకీయ పార్టీని ప్రారంభించిన నౌహీరా, ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో పలువురికి టిక్కెట్లు ఇస్తానని చెప్పి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more