జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి ఎన్నికల సమరంలోకి అడుగుపెడుతున్న క్రమంలో ఇప్పటికే ఉత్తరాంధ్ర పర్యటన చేసిన ఆయన.. ఇక ఇప్పుడు కోస్తాంధ్రలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలోని క్రాంతి కల్యాణమండపంలో పవన్ కల్యాణ్ పలు వర్గాలు, సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ముందుగా ఆటో డ్రైవర్ యూనియన్ సభ్యులతో పవన్ భేటీ అయ్యారు. డ్రైవర్ల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.
తన ఫోటోను ఆటోలపై పెట్టుకున్న డ్రైవర్లను కొంతమంది నేతలు వేధిస్తున్నారన్న విషయం తన దృష్టికి వచ్చిందని.. ఈ విషయంలో డ్రైవర్లు సంయమనం పాటించాలన్నారు. జనసేన అధికారంలోకి వస్తే.. సబ్సిడీపై బ్యాటరీ ఆటోలు అందజేస్తామన్నారు. ఆటో డ్రైవర్ల ఆత్మగౌరవం కాపాడతామని.. వారి సమస్యల్ని కూడా పరిష్కరిస్తామన్నారు.ఆ తరువాత ఆలిండియా దళిత హక్కుల సంఘం నేతలు, హమాలీలతో పవన్ భేటీ అయ్యారు.
ధళితుల సమస్యల్ని కూలంకుషంగా అలకించిన ఆయన.. ఈ క్రమంలో దళితుడిపై దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన ఘటనపై స్పందిస్తూ.. దానిని తీవ్రంగా ఖండించారు. చింతమనేని తీరు రౌడీషీటర్ను తలపిస్తోందని.. ఆయన్ను సీఎం అదుపు చేయకపోతే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. చంద్రబాబు దళిత తేజం కార్యక్రమం నిర్వహిస్తున్నా..దళిత, మురికి వాడల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు పక్కదోవ పట్టడంతో దళితవాడల్లో అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శించారు పవన్.
పవన్ ను వికలాంగులు కూడా కలిశారు. ఈ సందర్భంగా వికలాంగులు తమ సమస్యల్ని జనసేనానికి చెప్పుకున్నారు. వికలాంగులకు కూడా సొంత ఇల్లు ఉండాలని.. వారిపై ఆధారపడి ఉండే కుటుంబ సభ్యులకు కూడా పెన్షన్ ఉండాలని అభిప్రాయపడ్డారు పవన్. అనంతరం పాస్టర్ల సంఘం సభ్యులు జనసేనానిని కలిశారు. జనసేన అధినేతకు తమ ఆశీస్సులను అందజేశారు. ఈ సందర్భంగా పాస్టర్లు తమ సమస్యల్ని పవన్కు విన్నవించుకున్నారు.
వికలాంగులతో జనసేనాని సమావేశం.
— JanaSena Party (@JanaSenaParty) September 25, 2018
Live Link : https://t.co/KIVONnj7z3
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more