దేశంలోని మైనారిటీలందరకీ ఏకరీతిన పౌరస్మృతి కావాలన్న అంశాన్ని భారతీయ న్యాయ కమీషన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏకరీతి సౌరస్మృతి అవసరం కానీ అవశ్యకత కానీ ప్రస్తుతం చర్చనీయాంశమే కాదని.. దీని కన్నా ముందుగా కుటుంబ చట్టాలలో సంస్కరణల అవసరం వుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పెళ్లి, విడాకులు, భరణం సహా స్త్రీ, పురుషుల వివాహాల వయస్సులపై సంస్కరణలు తీసుకురావాలని సూచించింది.
రిటైర్డు జస్టిస్ బిఎస్ చౌహాన్ నేతృత్వంలోని భారత న్యాయ కమీషన్ ఈ ప్రజాస్వామ్య, లౌకికవాద దేశంలో మేజర్లైన వారు తమ మతాన్ని తామే ఎంచుకునే విధానాన్ని కూడా బలంగా రక్షించాల్సిన అవసరముందని అన్నారు. అదే సమయంలో సమాజానికి రుగ్మతలుగా మారిని త్రిపుల్ తలాక్, బాల్య వివాహాల వంటి సాంఘిక దురాచారాలను ఎలాంటి పరిస్థితుల్లో సహించరాదని ఇందుకు మతాచారాలను అడ్డుగా పెట్టుకోవడం కూడా సముచితం కాదని పేర్కోంది. సాంఘిక దురాచారాలకు మతాలను అడ్డుగా పెట్టుకోవడం సమాధిమూర్ఖత్వమని పేర్కొంది.
పురుషుల కనీస వివాహ అర్హత వయసు తగ్గే అవకాశం వుంది. ఇకపై అబ్బాయిలు 18 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చంటూ లాకమిషన్ సంచలన ప్రతిపాదన చేసింది. ఇప్పటి వరకు వివాహ అర్హత వయసు 21 ఏళ్లుగా ఉండగా, ఇప్పుడు దానిని మూడేళ్లు తగ్గించి 18 ఏళ్లుగా ప్రతిపాదన చేసింది. యథార్థంగా సమానత్వం సాధించాలంటే స్త్రీ, పురుషులిద్దరి వివాహ కనీస అర్హత వయసు 18 ఏళ్లుగా ఉండాలని భారత ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
అయితే, అమ్మాయిల వివాహ అర్హత కనీస వయసును 18 ఏళ్లుగానే ఉంచొచ్చని పేర్కొంది. ఇండియన్ మెజారిటీ యాక్ట్ 1875 ప్రకారం.. ఓ వ్యక్తి మెజారిటీ వయసు 18 ఏళ్లని, స్త్రీపురుషులిద్దరికీ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. లాకమిషన్ ప్రతిపాదనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్త్రీపురుష సమానత్వం మాట ఎలా ఉన్నా, ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరిస్తే బాల్య వివాహాలను ప్రోత్సహించినట్టు అవుతుందని చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more