ప్రముఖ జర్నలిస్ట్, మాజీ పార్లమెంటు సభ్యుడు, బ్రిటన్ మాజీ హైకమిషనర్ కుల్దీప్ నయ్యర్ కన్నుమూశారు. 95ఏళ్ల నయ్యర్ అనారోగ్య సమస్యలతో దిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 12.30 సమయంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుల్దీప్ నయ్యర్ అంతిమ సంస్కారాలు నగరంలోని లోధి స్మశానవాటికలో జరుగుతాయని నయ్యర్ పెద్ద కుమారుడు సుధీర్ నయ్యర్ వెల్లడించారు.
1923, ఆగస్టు 14న పాక్లోని సియోల్కోట్లో 1923 ఆగస్టు14న జన్మించిన కుల్దీప్ నయ్యర్ సీనియర్ జర్నలిస్ట్ గా, రచయితగా విశేష సేవలందించారు. నయ్యర్ ‘బియాండ్ ద లైన్స్’, ‘ఇండియా ఆఫ్టర్ నెహ్రూ’ సహా తదితర ఎన్నో ప్రముఖ రచనలు చేశారు. మానవ హక్కుల కార్యకర్తగానూ పనిచేశారు. 1990లో బ్రిటన్లో భారత హైకమిషనర్ గా సేవలందించారు. 1997లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
కుల్దీప్ నయ్యర్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ‘కుల్దీప్ నయ్యర్ మా కాలంలోని మేధో దిగ్గజం. ఆయన అభిప్రాయాలు నిజాయితీగా, నిర్భయంగా ఉంటాయి. ఆయన కొన్ని దశాబ్దాల పాటు సేవలందించారు. ఎమర్జెన్సీని బలంగా వ్యతిరేకించిన వ్యక్తిగా, దేశంలో పబ్లిక్ సర్వీసులు, కమింట్మెంట్స్ మరింత మెరుగుపడాలని తీవ్రంగా కోరుకున్న వ్యక్తిగా ప్రజలు ఆయనను ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఆయన మరణం ఎంతో బాధ కలిగించింది. సంతాపం తెలియజేస్తున్నా’ అని మోదీ ట్విటర్లో పోస్ట్ చేశారు.
కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా నయ్యర్ కు నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రముఖ జర్నలిస్టు, మానవ హక్కుల కోసం పోరాడిన ధీశాలి కుల్దీప్ నయ్యర్ మరణవార్త తనను చాలా దిగ్ర్భాంతికి గురిచేసిందని అన్నారు. కాలమిస్టుగా ఆయన తన భావాలను స్పష్టంగా నిజాయితీగా వ్యక్తపర్చారని, పాత్రికేయరంగానికి ఆయన చేసిన కృషి అనన్యమనదని, అది ఎప్పటికీ నిలచిపోతుందని కేజ్రీవాల్ ట్వీట్ లో తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. చాలా మంది సీనియర్ జర్నలిస్టులు, ప్రజలు నయ్యర్ మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.
Kuldip Nayar was an intellectual giant of our times. Frank and fearless in his views, his work spanned across many decades. His strong stand against the Emergency, public service and commitment to a better India will always be remembered. Saddened by his demise. My condolences.
— Narendra Modi (@narendramodi) August 23, 2018
Sad news coming in about the passing away of noted journalist and human rights crusader Mr Kuldip Nayyar.
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 23, 2018
He will be missed for his fight for press freedom and democratic values in these testing times. A huge loss to the nation https://t.co/rYft4uosc8
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more