మలయాళ రాష్ట్రంపై వరుణుడు తన ప్రకోపాన్ని చాటుతూ కాకవికళం చేస్తున్న క్రమంలో.. కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ శనివారం డిమాండ్ చేసింది. ఈమేరకు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 'ప్రధాని గారూ... కేరళలో గత వందేళ్లలో కనివినీ ఎరుగని రీతిలో వరదలు బీభత్సం సృష్టించాయి. అక్కడ పరిస్థితులు అత్యంత తీవ్రంగా వున్నాయి. కేరళ వరదలను ఇంకెంత మాత్రం జాప్యం చేయకుండా జాతీయ విపత్తుగా ప్రకటించండి. లక్షలాది మంది ప్రజల ప్రాణాలు, జీవనోపాధి ప్రమాదంలో పడింది' అని ఆ ట్వీట్లో రాహుల్ పేర్కొన్నారు.
ప్రధాని కేరళ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర మంత్రి కేజే ఆల్ఫోన్స్తో జరిపిన సమీక్ష వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ మేరకు ట్వీట్ చేశారు. ఇప్పటికే కేరళ రాష్ట్రాన్ని అని విధాలుగా అదుకోవాలని మోడీని కోరారని చెప్పిన ఆయన.. అస్తులను, అయినవారిని కోల్పోయి అన్ని విధాలుగా అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరింతగా ముందుకురావాలని తాజా ట్వీట్ ద్వారా కోరారు.
Dear PM,
— Rahul Gandhi (@RahulGandhi) August 18, 2018
Please declare #Kerala floods a National Disaster without any delay. The lives, livelihood and future of millions of our people is at stake.
తమ పార్టీ కేరళ విభాగం డిమాండ్ ను కేంద్రం ఎదుట ఉంచారు. కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించి మళయాలీయులను అన్ని విధాలుగా ఆదుకోవాలని, కేంద్రం మరిన్ని రక్షణ బలగాలను రంగంలోకి దింపాలని ఆయన కోరిన విషయం తెలిసిందే. అయితే బీజేపి మాత్రం తమదైన శైలిలో స్పందించింది. కాంగ్రెస్ డిమాండ్ ను తోసిపుచ్చింది. బీజేపి పార్టీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ కేరళ పరిస్థితి దిగ్ర్భాంతి కలిగిస్తుందని అంటూనే.. వరదలు సహజమని.. అయితే కేంద్రం చేయగలిగిన సాయం చేస్తుందనే ఆయన వ్యాఖ్యానించారు.
ఇక మరోవైపు తన నియోజకవర్గంలోని పరిస్థితి లైవ్ టీవీలో వివరిస్తూ.. బావోద్వేగానికి గురైన చెనగన్నూర్ ఎమ్మెల్యే సాజీ చెరియన్ కంటతడి పెట్టిన నేపథ్యంలో ఆయన నియోజకవర్గంలో సహాయక చర్యలను చేపట్టేందుకు నావికాదళం పది బోట్లను పంపింది. నిన్న రాత్రి స్థానిక టీవీ ఛానల్ తో మాట్లాడుతూ తన నియోజకవర్గంలో దాదాపు 50 మంది మృతి చెందారని ఇంకా ఎందరో ఇళ్లలోని పైకప్పులపై సహాయం కోసం ఎదురుచూస్తున్నారని.. వారిని వెంటనే అదుకోవాలని ఆయన కంటతడి పెట్టారు.
‘‘దయచేసి ప్రధాన మంత్రి మోడీని హెలికాప్టర్లు పంపమని అడగండి. హెలికాప్టర్లు పంపండి. ప్లీజ్ ప్లీజ్.. లేకపోతే 50వేల మంది చనిపోతారు. గత నాలుగు రోజుల నుంచి మేము నావికాదళం సాయం అడుగుతున్నాం. ఇప్పటి వరకు వారి సాయం అందలేదు. ఇక్కడ వరదలో చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు కేవలం ఎయిర్ లిఫ్టింగ్ ఒకటే పరిష్కారం.. ప్లీజ్, ప్లీజ్’’ అంటూ బాధను వ్యక్తం చేశారు. ఇక వరద ప్రభావిత ప్రాంతాలలో చెనగన్నూర్ కూడా తీవ్రంగా నష్టపోయిందని, ఆ ప్రాంతం మొత్తం జలదిగ్భధనంలో చిక్కుకుందని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more