ఇప్పటికే అప్పుగా ఇచ్చిన రుణాలను పోందిన బడాబాబులు దేశం దాటి వెళ్లిపోతున్న నేపథ్యంలో.. వారు విదేశాలకు ఎలా తరలివెళ్తున్నారన్న విమర్శల వెల్లువెత్తి కేంద్ర ప్రభుత్వం అప్రతిష్టను మూటగట్టుకుంటుంది. ఈ తరుణంలో రుణాలను రికవరీ చేసే ట్రిబ్యూనల్ గత జూన్ నెల నుంచి పనిచేయకపోవడంతో దాఖలైన పిటీషన్ ను విచారించిన బాంబే హైకోర్టు కేంద్రం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో అసలు అర్థిక మంత్రి ఉన్నారా.. ఉంటే ఆయన నిద్రపోతున్నారా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
జూన్ 2న దక్షిణ ముంబైలోని బలార్డ్ ఎస్టేట్ వద్ద ఉన్న ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. డీఆర్ టీ కార్యాలయం కూడా ఈ భవనంలోనే ఉంది. అగ్నిప్రమాదం కారణంగా డీఆర్ టీని మూసివేశారు. అప్పటినుంచి కేంద్రం డీఆర్ టీకీ మరో భవనమేదీ కేటాయించలేదు. దీనిపై డీఆర్ టీ బార్ అసోసియేషన్ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. దక్షిణ ముంబైలో ట్రిబ్యునల్ కు మరో భవనం కేటాయించేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని తన పిటిషన్ లో కోరింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన జస్టిస్ ఏ ఎస్ ఓకా, జస్టిస్ రియాజ్ చాగ్లాతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
డీఆర్ టీ కోసం ప్రత్యామ్నాయ భవనాన్ని కేంద్రప్రభుత్వం ఎప్పుడు గుర్తిస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నామని వ్యాఖ్యానించింది. సమస్య తమ దృష్టికి రాకముందే, ఆదేశాలు ఇవ్వకముందే.. కేంద్రప్రభుత్వం తనకు తానుగా ఈ పనిచేసి ఉండాల్సిందని జస్టిస్ ఓకా అన్నారు. దేశ ఆర్ధిక రాజధానిలో రుణాల రికవరీ ట్రైబ్యునల్ కార్యాలయం మూసి ఉందంటే ఆర్ధిక మంత్రి నిద్రపోతున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసిన హైకోర్టు అప్పటిలోగా ట్రైబ్యునల్ కు మరో భవనం కేటాయించాలని ఆదేశించింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాల ఎగవేతదారులకు సంబంధించిన ఫిర్యాదులను డీఆర్ టీ పరిశీలిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more