హైదరాబాద్లోని కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో అదృశ్యమైన ఆడశిశువు ఆచూకీ పోలీసులకు దొరికింది. ఆ పాప బీదర్ లో ఉందని తెలుసుకున్న హైదరాబాద్ పోలీసులు అక్కడకు వెళ్లి ఆమెను స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్కు తీసుకువస్తున్నారు. కాగా, రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన విజయ అనే మహిళ ఆడశిశువుకు జన్మనిచ్చి, ఆమె కదల్లేని స్థితిలో ఆసుపత్రిలో ఉంటోంది. విజయ వద్ద ఎవరూ లేని సమయం చూసుకున్న ఓ మహిళ ఓ పథకాన్ని వేసుకుంది.
పాపకు టీకా ఇచ్చారా.. అంటూ వచ్చి టీకా వేయిస్తానంటూ మాయమాటలు చెప్పి కథల్లేని స్థితిలో వున్న తల్లి పక్కలోంచి బిడ్డను తీసుకెళ్లి, తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన విజయ కనిపించిన నర్సులను విచారించగా.. పాపను తాము తీసుకెళ్లలేదని చెప్పడంతో.. అందోళనకు గురైంది. విషయం తెలుసుకున్న విజయ బంధువులు పెద్ద సంఖ్యలో అసుపత్రికి చేరుకుని పురిట్లోని బిడ్డను ఎత్తుకెళ్లడమేంటని అందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని.. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా పలు ఆధారాలు లభ్యమయ్యాయి. అపహరణకు గురైన చిన్నారి ఆచూకీ కోసం గాలించేందుకు 6 బృందాలను ఏర్పాటు చేశారు. చిన్నారి కిడ్నాప్ అయ్యిందన్న వార్త దవానంలా వ్యాపించడంతో.. ఎత్తుకెళ్లిన కిడ్నాపర్ పాపను బీదర్ లోని ఓ ప్రభుత్వాసుపత్రిలో వదిలేసి వెళ్లింది. దీంతో అక్కడే చిన్నారి శిశువుకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. దీంతో శిశువు తల్లిదండ్రులను పోలీసులు ప్రత్యేక వాహనంలో బీదర్ తరలిస్తున్నారు. కాగా, నిందితురాలి కోసం పోలీసులు గాలింపు ముమ్మరంగా కొనసాగుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more