ప్రత్యేక హోదా సంజీవని కాదు.. అది ముగిసిన అధ్యాయం.. అంతకన్నా రెట్టింపుస్థాయిలో వచ్చే ప్యాకేజీయే ముద్దు అని ఇటీవలి కాలం వరకు వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన తనయుడి నుంచి కూడా ఎలాంటి విన్నపాలు రాలేదు. ఐతే ఇప్పుడు చంద్రబాబు మళ్లీ ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్షలకు దిగుతూ.. రాష్ట్ర ప్రజలను మమేకం చేసే పనిలో వుండగా, ఆయన తనయుడు, మంత్రి లోకేస్ మాత్రం వినూత్నంగా అలోచించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 'ప్రేమలేఖ' రాశారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని.. ప్రధానమంత్రిని కోరుతున్నట్లు పేర్కొంటూ ఆయన ఈ లేఖను ప్రధాని మోడీకి పోస్ట్ చేశారు. ఈ ఫొటోను ఆయన ట్వీట్ చేశారు. 'మోడీజీ.. ఐదు కోట్ల ఆంధ్రుల తరఫున మీకు 'ప్రేమలేఖ' పంపిస్తున్నా.. దీన్ని తెరిచి చదవండి. దీన్ని డస్ట్ బిన్లో పడేస్తారన్న విషయం నాకు తెలుసు. కానీ.. ఆంధ్రులకు మీరిచ్చిన మాటను క్షణంపాటు గుర్తు చేసుకోండి' అని లోకేష్ ప్రధానికి ఘాటైన సూచన చేశారు. ఈ ఉత్తరం ద్వారా ప్రత్యేక హోదా రాదని తెలిసినా వినూత్నంగా నిరసన తెలపడం కోసం లోకేష్ ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.
‘‘ప్రత్యేక హోదా కోరుతూ ప్రధానికి పోస్ట్ కార్డ్ పంపాను. మీరు కూడా ఆయనకు పోస్ట్ కార్డ్ పంపండి. ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి #ToPMWithLove అనే హ్యాష్ ట్యాగ్ వాడండ’’ని లోకేష్ ప్రజలను కోరారు. దయచేసి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండని ఇంగ్లిష్లో రాసిన లేఖను న్యూఢిల్లీ రెజినా హిల్స్లోని ప్రధాని కార్యాలయానికి లోకేష్ పోస్టు చేశారు. కాగా, ప్రధానికి రాసిన పోస్టుకార్డులో కూడా తప్పులు వుండటాన్ని నెట్ జనులు విమర్శిస్తున్నారు. అమరావతి స్పెల్లింగ్ సహా సెక్రటేరియట్ పదాల్లో తప్పులు దొర్లాయని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అంతేకాదు ఇప్పటివరకు ఆయన మాటలోనే తప్పులు దోర్లేవని తెలుసు.. కానీ ఇప్పుడు ఆయన రాతలో కూడా తప్పులు దొర్లుతున్నాయని విమర్శిస్తున్నారు.
Hello @narendramodi Ji. Mailed you a love letter on behalf of 5 crore people of Andhra Pradesh. Please do open it Sir. I am sure I’ll find it back in the garbage bin of Raisina Hill after you throw it away. But at least think for a second the promises you made when you were here. pic.twitter.com/UttG0eEcsb
— Lokesh Nara (@naralokesh) June 7, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more