ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలోని అధికారిక నివాసంలో కింద తవ్వినా ఏదో ఖనిజం ఉంటుంది జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. ఉత్తరాంధ్ర పోరాట యాత్రలో భాగంగా విశాఖపట్నం జిల్లాకు చేరుకున్న ఆయన అరకులో గిరిజన యువతతో సమావేశమయ్యారు. అడవిపుత్రులుగా బాసిసుల్లుతున్న గిరిజనులు నిజమైన ప్రకృతి బిడ్డలని ఆయన వ్యాఖ్యానించారు. అయితే గిరిజన తాండల్లో ఏళ్లుగా సమస్యలు తిష్టవేశాయని, వారి సమస్యలను గత ప్రభుత్వాలు తీర్చడంలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు.
ప్రకృతి, అడవులు ఇంకా మనకి మిగిలి ఉన్నాయంటే దానికి కారణం గిరిజనులేనని ఆయన కొనియాడారు. ప్రకృతికి దగ్గరగా బతికేవాళ్ల దగ్గర అవినీతి ఉండదు. దానిని దాటి ఏదో సంపాదించుకోవాలని అత్యాశతోనే అవినీతికి జీజం పడుతుందని ఆయన అరోపించారు. అయితే ఇది రాజకీయ నాయకుల ప్రోద్భలంతోనే జరుగుతుందని, వారికి ప్రభుత్వాలు కూడా అండగా నిలువడం ఆందోళన కలిగించే విషయమని అన్నారు. అయితే తాను అభివృద్దికి వ్యతిరేకం కాదని, ప్రగతిబాటలో మైనింగ్ చేయడం అవసరమేనన్న అయన అది ఎక్కడ తవ్వాలి? ఎంత మేరకు అనేది నిబంధనలకి అనుగుణంగా ఉండాలని అన్నారు. ఇష్టానుసారంగా మైనింగ్ కు పాల్పడితే అవి ప్రకృతి, పర్యావరణానికి చేటని అన్నారు.
అమరావతిలో చంద్రబాబు ఇంటి కింద తవ్వినా ఏదో ఒక ఖనిజం దొరుకుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇక్కడికి గిరిజనులను రెచ్చగొట్టడానికో, మభ్యపెట్టడానికో , రాజకీయ అవసరాలకో రాలేదు. గిరిజనులకు అండగా ఉండేందుకే వచ్చానని.. వాళ్లను భయపెట్టి, బలహీనులుగా చేస్తే వారికి తమ పార్టీ అండగా వుంటుందని చెప్పడానికే వచ్చానన్న పవన్.. అవసరమైతే అలాంటి వారిపై పోరాడటానికి కూడా తమ పార్టీ సిద్దమని అన్నారు. గిరిజనులకు సాయం చేయడంలో అన్ని విధాలుగా అండగా ఉంటానని అన్నారు.
అయితే అందుకు తాను వారి నుంచి ఏమీ ఆశించడం లేదని కూడా చెప్పారు. గిరిజన ఏజెన్సీలలో అక్రమంగా సాగుతున్న బాక్సైట్ మైనింగ్ విషయంలో తాను అనునిత్యం గిరిజనులవైపునే పోరాడతానని హామి ఇచ్చారు. బాక్సైట్ తవ్వకాలపై గ్రామసభలు పెట్టి 70 శాతం ప్రజల ఆమోదంతోనే తవ్వకాలు జరపాలని ఆయన సూచించారు. ఏసీ గదుల్లో కూర్చొని.. గిరిజనులు తలరాతలు మారుస్తామంటే అవి సాధ్యపడదని అన్నారు. అడవిపుత్రుల జీవితాలు మారలాంటే.. అందుకు తగు అభివృద్ది కూడా కావాలని అన్నారు.
ఎన్నికలలో హామీలను ఇచ్చి వాటిని అమలు చేయలేని పార్టీలకు రానున్న ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చుతాం అని టీడీపీ మేనిపేస్టోలో పెట్టి వాళ్లో ఓట్లు వేయించుకుందని అన్నారు. దానిని తాను ప్రశ్నించి.. హామీని నిలబెట్టుకోవాలని కొరితే.. గిరిజనుల్ని తనపైకి రెచ్చగొట్టారని విమర్శించారు. నాలుగు దశాబ్దాల చంద్రబాబు అనుభవం కులాల మధ్య కుమ్ములాటలు పెట్టడానికే పనికి వచ్చిందంటూ జనసేనాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more