కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ప్రభుత్వ ఏర్పాటు, యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం, సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ప్రలోభాలు.. అడియో టేపులు.. బలనిరూపణకు ముందే యడ్యూరప్ప రాజీనామా.. కుమారస్వామి ప్రమాణస్వీకారం.. స్పీకర్ ఎన్నిక వరకు అన్ని అంశాల్లో తనదైన స్టాండును స్ట్రాటజీతో అవలంభిస్తున్న బీజేపి చివరకు కుమారస్వామి ప్రభుత్వ విశ్వాస పరీక్షను ఎదుర్కోన్న క్రమంలోనూ వినూత్న తరహా స్ట్రాటెజీని అవలంభించింది.
ఉదయం స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో చివరివరకు తమ అభ్యర్థి సురేష్ కుమార్ ను పోటీలో నిలపిన బీజేపి చివరాఖరున ఉపసంహరించుకుంది. దీంతో స్పీకర్ గా రమేష్ కుమార్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. రమారమి అదే స్ట్రాటజీని విశ్వాస పరీక్ష లోనూ అవలంబించింది బీజేపి. సరిగ్గా విశ్వాస పరీక్షకు అధికార పక్షానికి బలం వుందని నిరూపితం చేసేందుకు ముందే నాటకీయ పరిణామాల మధ్య వాకౌట్ చేసింది. అయితే వాకౌట్ చేసే ముందకు బీజేపి పక్ష నేత యడ్యూరప్ప చేసిన కీలక వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా మారాయి.
విశ్వాసపరీక్ష నేపథ్యంలో ప్రసంగించిన యడ్యూరప్ప.. తనకు కాంగ్రెస్ మీద ఎలాంటి కోపం లేదని, అయితే అవినీతి పరులైన దేవేగౌడ, కుమారస్వామీలపైనే తన అక్రోశమంతా అని అన్నారు. కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసినందుకు శివకుమార్ త్వరలోనే చింతిస్తారని జోస్యం చెప్పారు. ఇక వాకౌట్ చేసే క్రమంలో యడ్యూరప్ప తాను చేసిన నేరాలను అంగీకరించారు. తాను పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాట్లాడింది నిజమని అంగీకరించారు.
అనైతిక కూటమి అధికారంలోకి ఎలా వస్తాయని తాను ఈ కూటమిని అధికారంలోకి రానీయకుండా అడ్డుకునేందుకే ఇలా చేశారని యడ్యూరప్ప అన్నారు. ఈ కూటమి పార్టీలు తమ స్వార్థం కోసం, అధికారం కోసం ఎంతస్థాయికైనా దిగజారుతాయని అన్నారు. తాను గతంలో కుమారస్వామితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు ఇప్పుడు భాధపడుతున్నానని అన్నారు. ఇక వెళ్తూ వెళ్తూ.. ఆయన కుమారస్వామికి సవాల్ విసిరారు. చూద్దం కుమారస్వామి మీరు ఎంతకాలం పదవిలో కొనసాగుతారో.? అంటూ వెళ్లారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more