భోజ్ పురి చిత్రపరిశ్రమలో ఒక సంచలన విషయం అభిమానులను కలవరానికి గురిచేస్తుంది. సూపర్ స్టార్ పవన్ సింగ్ మద్యం మత్తులో తన సహనటిపై చేయి చేసుకోవడమే కాదు.. ఏకంగా అమెపై దాడికి కూడా పాల్పడ్డాడని వార్తలు వెలుగుచూడటంతో.. అసలేం జరిగిందన్న ఉత్కంఠకు అభిమానులు గురవుతున్నారు. బోజ్ పూరి చిత్రసీమలో టాప్ నటిగా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న నటి అక్షరాసింగ్ ను హీరో పవన్ సింగ్ తోసి పడేశాడు. అమె తలను గోడకేసి మరీ బాదాడన్న వార్తలను ప్రముఖ జర్నలిస్ట్ శశికాంత్ సింగ్ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా సంచలనంగా మారింది.
కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రానగర్ హావేలి రాజధాని సిల్వాసాలోని దామన్గంగా వ్యాలీ రిస్టార్లో గురువారం అర్ధరాత్రి 11.30 గంటలకు ఈ ఘటన జరిగిందని కూడా శశికాంత్ సింగ్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా ఫాలోవర్లతో పంచుకున్నారు. పూర్తిగా మద్యం మత్తులో ఉన్న పవన్ అక్షరపై చేయి కూడా చేసుకున్నాడని శశికాంత్ సింగ్ ఆరోపించారు. ఆమె జుట్టు పట్టుకుని గోడకేసి బాదాడని ఆరోపించారు. నటి చేతిపై గాయాలయ్యాయని తెలిపారు. అక్షరను అతడి బారి నుంచి రక్షించేందుకు ప్రయత్నించిన రిసార్ట్ సిబ్బందిపైనా పవన్ దాడి చేశాడని వివరించారు.
ఓ సినిమా చిత్రకరణ కోసం వీరిద్దరూ సిల్వస్సా వచ్చారు. పవన్ బాగా తాగి తన గది బయటకు వచ్చినప్పుడు అక్షర అతడిని ఆపే ప్రయత్నం చేయగా అతడు అసభ్యంగా ప్రవర్తించాడు. అమెపై అసభ్యపదజాలంతో విరుచుకుపడటంతో పాటు అమెపై ఏకంగా దాడికి పాల్పడ్డాడని శశికాంత్ సింగ్ పేర్కొన్నారు. పవన్ గతంలో అక్షరను కొన్ని సినిమాల్లోంచి తప్పించినట్టు కూడా ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో చిత్ర షూటింగ్ అవ్వగానే సిల్వస్సా నుంచి అమె ముంబై చేరుకునేందుకు సిద్దమైనా ఆమెను విమానాశ్రయం వద్ద దిగబెట్టేందుకు నిర్మాణ సంస్థ ఏర్పాటు చేయకపోవడంతో.. అమె అక్కడే కాటేజీలో వుండిపోయింది. దీంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, పవన్-అక్షరలు గతంలో డేటింగ్ చేసినట్టు కూడా వార్తలు హల్ చల్ చేశాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more