రానున్న2019 సార్వత్రిక ఎన్నికలలో తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారో చెప్పకనే చెప్పేశారు కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి. ఏప్రిల్ 2న రాజ్యసభ సభ్యురాలిగా పదవీకాలం ముగిసిపోతున్న నేపథ్యంలో దానికి విరమణ చేయనున్న ఆమె తాను రానున్న లోక్ సభ సాధారణ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఓటమి చెందడం తనకు ఇంటర్వెల్ లాంటిదని రాజకీయాల్లో గెలుపోటములు సహజమని అన్నారు.
రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ సభ్యులు చేపట్టిన ఏపీకి ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటానికి మద్ధతు ఇచ్చిన రేణుకాచౌదరి దీనిపై వివరణ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని తాను డిమాండు చేశానే తప్ప ఇక్కడ రాజకీయాలకు తావు లేదన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం తాను పోరాటం చేస్తూనే ఉంటానని రేణుకాచౌదరి వివరించారు.
కాగా, 1999, 2004 ఎన్నికల్లో రేణుకాచౌదరి ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. కాగా, గత 2014 ఎన్నికల్లో వైస్సార్ సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో ఓటమి పాలైన అమెను.. అధిష్టానం రాజ్యసభ సభ్యురాలిగా ఎంపిక చేసి ఢిల్లీకి రప్పించుకుంది. కాగా అమె పదవీ కాలం ముగిసిపోవడంతో.. అమె రానున్న ఎన్నికలపై అప్పుడే దృష్టి సారించారు. తాను రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నా నిత్యం ఖమ్మం ప్రజలతో కలిసే ఉన్నానని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more