రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం నిర్మించాలని జనసేన, సీఫీఐ, సీపీఎం పార్టీలు ఉమ్మడి నిర్ణయం తీసుకున్నాయని సీపీఎం నేత మధు తెలిపారు. రాష్ట్రంలోని రైతాంగం, యువతీయువకులు, మేధావులు, ఉద్యోగులు, ఇలా ఒక్కరు కాకుండా అన్నివర్గాల ప్రజలను సమీకరించి పెద్దస్థాయిలో ఉద్యమాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. మొదట రాయలసీమ నుంచి ఈ ఉద్యమం ప్రారంభమవుతుందని, ఆ తరువాత ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలకు కూడా చేరుతుందని, ఇలా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రజల అకాంక్ష నేపథ్యంలో ప్రత్యేకహోదా కోసం జరిగే తమ ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు.
పోలవరం ప్రాజెక్టు విషయంలో లెక్కలు పంపలేదని రాష్ట్రంపై కేంద్రం అక్షేపణలు వ్యక్తం చేసి నిధులను విధిల్చకుండా చేయడంపై స్పందించిన మధు, రాష్ట్రంలో రెండు గిరిజన యూనివర్శిటీల ఏర్పాటుకు బీజేపి నాలుగేళ్లు పూర్తికావస్తున్న పార్లమెంటులో చట్ట సవరణ చేయలేదని ఎద్దేవా చేశారు. 11 జాతీయ సంస్థలకు 421 కోట్ల రూపాయలను మాత్రమే ఇచ్చారని ఇక అమిత్ షా ఉత్తరం అంతా బుకాయింపు మాత్రమేనని దుయ్యబట్టారు. అటు కేంద్రంతో నాలుగేళ్ల పాటు సఖ్యతగా వ్యవహరించిన చంద్రబాబు.. ఇన్నాళ్ల పాటు ప్రజలకు ఏ విషయాలను వెలువరించకుండా.. అన్ని విషయాలను దాచుకుని ఇప్పుడు ఎన్నికలకు ముందుమాత్రం దొంగఏడుపులు ఏడుస్తున్నారని విమర్శించారు. టీడీపీ-బీజేపీ లు ఏపీ ప్రయోజనాలను విస్మరించాయని అందుకనే వాటికి దూరంగా తాము ఉద్యమాల బాట పడుతున్నామని చెప్పారు.
అనంతరం సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలని, అప్పటి వరకూ తమ పోరాటం కొనసాగిస్తామని, ఏప్రిల్ నెలలో మొదటి సమావేశం అనంతపురంలో నిర్వహిస్తామని చెప్పారు. కొత్త రాజకీయ వేదిక కావాలని నవతరం యువత కోరుకుంటున్నారని అన్నారు. ప్రజల కోసం పనిచేసి.. ప్రజల ఎజెండాను ముందుకు తీసుకువెళ్లామని, ఐదు కోట్ల అంధ్రులు ఆకాంక్ష ప్రత్యేక హోదాను సాధించే వరకు తమ ఉద్యమం అగదని అన్నారు. ఈ భాద్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వున్నా అవి వాటిని పూర్తిగా విస్మరించాయని దుయ్యబట్టారు.
నాలుగేళ్లుగా కేంద్రానికి వంతపాడిన టీడీపీ ఇప్పుడు కేంద్రంతో పోరాడుతున్నట్లుగా కొత్త డ్రామాను రక్తి కట్టించేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. మోడీ ప్రభుత్వంతో రాష్ట్ర అధికార, విపక్ష పార్టీలు లాలూచీ పడ్డాయని ఆయన అరోపించారు. అందుకనే తాము ఇటు తమతో కలసివచ్చే రాజకీయ పార్టీలతో పాటు మేధావులు, ఉధ్యోగులు, యువత, విద్యార్థులు, రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజల సహకారంతో ఉద్యమాన్ని నిర్మించనున్నామని చెప్పారు. ఇందులో భాగంగా, ఈ నెల 27న ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా పాటిస్తామని, ఈ నెల 29న విద్యార్థి జేఏసీ ఏర్పడుతుందని రామకృష్ణ చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more