ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో కేంద్రం తన ధోరణిని అది నుంచి స్పష్టంగానే చెబుతూ వచ్చిందని, అయితే గడిచిన నాలుగేళ్లు కేంద్రాన్ని తన భుజస్కాందాలపై మోసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు.. తన అవగాహనాలోపంతో కేంద్రం ఒక్కటి చెబితే తాను మరోటి అర్థం చేసుకుని ప్రజలకు చెప్పారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అరోపించారు. కేంద్రం ప్రకటనలను తనకు ఇన్నాళ్లు తనకు అనుకూలంగా మార్చుకుని రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతూ వచ్చిన చంద్రబాబు.. ఎట్టకేలకు నిజానిజాలను గ్రహించి.. కేంద్ర ప్రభుత్వం నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటన చేయడం ప్రజా విజయమని అన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కానీ లేక ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కానీ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఎన్నడూ మాటమార్చలేదని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో చంద్రబాబు గత్యంతరం లేని పరిస్థితుల్లో మెట్టుదిగావచ్చారని అన్నారు. అయితే చంద్రబాబు ఈ చర్యలను సరిగ్గా ఎన్నికల ముందు చేపట్టడం ప్రజలను మరోమారు మభ్యపెట్టడానికేనని అరోపించారు.
కేంద్రమంతి అరుణ్ జైట్లీ ఇచ్చిన తాజా ప్రకటన.. 2016 సెప్టెంబర్ 8న చేసిన ప్రకటనకు ఏ మాత్రం వత్యాసంలేదని అయితే అప్పడు అర్థరాత్రి పూట స్వాగతించిన చంద్రబాబు.. తాజా ప్రకటనను మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. అప్పుడు కేంద్రమంత్రులను సన్మానించిన చంద్రబాబు.. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని చెప్పి ప్రకటించారని, దీని వల్ల జరిగే లబ్ది ఇకపై ప్యాకేజీ తీర్చుతుందని అన్నారు. ఇక తాజాగా యూటర్న్ తీసుకొవడం ప్రజల ఒత్తిడే కారణమని, ఇదే ప్రజా విజయమని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14వ అర్థిక సంఘం అసులు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో ఎలాంటి సిఫార్సులు చేసింది. అయినా దాని పేరును చెప్పి కేంద్రం కప్పదాటు అడుగులు వేస్తుంటే.. ఇన్నాళ్లు ఇక అది ముగిసన అద్యాయమని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు మాత్రం విభేదిస్తున్నారని ఇదంతా కేవలం ఎన్నికల ముందు డ్రామాగా ఆయన కోనియాడారు. పార్లమెంటు సాక్షిగా యూపిఏ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన మాటను నెరవేర్చాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వంపై వుందని జగన్ డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more