దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విగ్రహాల విధ్వంసపర్వం కొనసాగుతోంది. త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత కమ్యూనిస్టు యోధుడు లెనిన్ విగ్రహాన్ని బుల్డోజరుతో ధ్వంసం చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం కాగా, తమిళనాడులో ఉగ్రవాది రామస్వామి విగ్రహాలను ధ్వంసం చేస్తామని బీజేపీ నేత హెచ్ రాజా తన ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టు సంచలనాన్నే కలిగించింది.
ఇదిలా ఉంటే గత రాత్రి తమిళనాడు వాసులు తమ నేతగా కొలుచుకునే పెరియార్ రామస్వామి విగ్రహం ధ్వంసం చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో నిత్యమూ బిజీగా ఉండే కాళీ ఘాట్ ప్రాంతంలో ఉన్న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ విగ్రహానికి అవమానం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని కూల్చి వేశారు. వరుసగా జరుగుతున్న ఈ విధ్వంసపర్వాలపై ప్రధాని మోదీ సీరియస్ అయ్యారు.
ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతుండగా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ అధికారులతో చర్చించారు. విగ్రహాల కూల్చివేతకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మోదీ సూచించారని, నిందితులు ఎవరైనా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలని హోం మంత్రిత్వ శాఖ అధికారులు సూచించారు. ఈ తరహా దాడులు దేశ భవిష్యత్తుకు మంచిది కాదని ప్రధాని అభిప్రాయపడ్డారని వెల్లడించారు. ఇటువంటి ఘటనలు మరోసారి జరుగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించారని హోంశాఖ ప్రతినిధులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more