పార్లమెంటులో ఐదోసారి కేంద్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేంద్ర విత్తమంత్రి అరుణ్ జైట్లీ వేతన జీవులకు మాత్రం ఊరట కల్పించలేదు. తమ వ్యక్తిగత అదాయపన్నులో కొంతమేరకైనా ఊరటను కల్పిస్తారని అశించిన వేతనజీవులపై మోడీ ప్రభుత్వం కరుణను ప్రసరించలేదు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా.. వేతన జీవుల పట్లు ఎలాంటి ఊరట కలిగించలేదు. ఏడాదికి రెండున్నర లక్షల లోపు వేతనాన్ని అర్జించేవారి సంఖ్యకు యూపీఏ ప్రభుత్వంలో లభించిన ఊరట మాత్రమే కొనసాగుతుంది. వీరు ఎలాంటి పన్నులు చెల్లించే అవసరం లేదు.
అయితే కాస్తో కూస్తో రెండున్నర లక్షల నుంచి మూడున్నర లక్షల రూపాయల వరకు అర్జిస్తున్న వారి సంఖ్య కూడా పెద్దగానే వుండగా, వీరికి మాత్రం ఎలాంటి ఊరట లభించలేదు. ఎన్నికల ముందు ఏడాది కావడంతో ఇప్పుడైనా కేంద్రం తమను కరుణిస్తుందని వేయి కళ్లతో ఎదురుచూసిన వేతన జీవులు అశలు గల్లంతయ్యాయి. నోట్ల రద్దు, జీఎస్టీ తరువాత పన్నులు 50శాతం మేర పెరిగయని, పన్నులు కట్టే వారి సంఖ్య కూడా పెరిగిందని చెప్పిన కేంద్రం.. పన్ను చెల్లింపుదారులలో ప్రథమార్థులుగా వున్న వేతన జీవులకు మాత్రం వాటి ఫలాలను అందించడంలో తాత్సారం చేస్తుంది.
2017-18 అర్థిక సంవత్సరానికి గాను రూ.21.54 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేంద్రం.. 3.3 శాతం మేర ద్రవ్యలోటును అంచనా వేసింది. దీంతో పూర్తి అంచనా రూ.21.57 లక్షల కోట్లుగా పేర్కొంది. ఈ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వేతనాలను పెంచిన కేంద్రం.. పనిలో పనిగా ఎంపీల వేతనాలను కూడా పెంచేసింది. ప్రజాప్రతినిధులుగా, ప్రజలకు సేవకులమని చెప్పుకునే నేతలు.. ప్రజల బాగోగులను మర్చి ప్రతీ ఐదేళ్లకోసారి పెరుగుతున్న ద్రవ్యోల్భణానికి అనుగూణంగా తమ వేతనాలను పెంచుకునే వెసలు బాటును కూడా కల్పించుకోవడంపై వేతన జీవలులు మండిపడుతున్నారు.
ఇక ఇదే క్రమంలో స్టాక్ మార్కెట్లలో దీర్ఘకాలిక పెట్టుబడులపై వచ్చే లాభాలపై కూడా కేంద్రం పన్నుపోటును విధించింది. దానికి ఎల్టీసీజీ పన్నుగా కూడా నామకరణం చేసింది. దీంతో స్టాక్ మార్కెట్లలో మరీ ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ సహా ఇతరాత్ర దీర్ఘకాలిక పెట్టుబుడల నుంచి లాభాలను అర్జించడంపై కూడా ఇకపై పన్నుపోటు పడనుంది. పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తూ ఈ ప్రకటనను వెలువరించగానే స్టాక్ మార్కెట్లు తిరోగమనం బాటపట్టాయి. అంతే అయన ప్రకటన చేసిన క్షణాల్లో మార్కెట్లు ఏకంగా 300 పాయింట్ల లాభాన్ని కోల్పోయాయి.
వ్యక్తిగత అదాయపు పన్నులో కీలకాంశాలు ఇవే:
* బ్లాక్ మనీపై చేస్తున్న పోరాటం సత్ఫలితాలను ఇస్తోంది.
* 2016-17లో పన్ను చెల్లింపుదారులు 19.25 లక్షల మంది పెరిగారు.
* 8.72 కోట్లకు చేరుకున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య.
* గత రెండేళ్లలో భారీగా పెరిగిన పన్ను వసూళ్లు.
* 40 శాతం పెరిగిన రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య.
* మారని వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితులు.
* కొనసాగనున్న ప్రస్తుత శ్లాబ్ విధానం.
* వేతనజీవులకు ప్రయాణ, వైద్య ఖర్చులపై రూ. 40 వేల వరకూ పన్ను రాయితీ.
* సీనియర్ సిటిజన్ల వైద్య ఖర్చులకు మరింత అదనపు రాయితీ.
* వయో వృద్ధులకు అదనపు రాయితీ రూ. 60 వేల నుంచి రూ. లక్షకు పెంపు.
* వయోవృద్ధుల డిపాజిట్లపై రూ. 50 వేల వరకూ టీడీఎస్ రద్దు.
* తీవ్ర అనారోగ్యాల బారిన పడ్డ సీనియర్ సిటిజన్లకు ఇల్ నెస్ డిడక్షన్ రూ. 50 వేలు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more