ఎన్నికల వేళ రాజకీయ నాయకులు ఎదో ఒక జిమ్మిక్కుతో ప్రజలను అకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు విదేశాల్లోని నల్లధనాన్ని దేశానికి తీసుకువచ్చి దేశ ప్రజలక ఖాతాలలో వేస్తామని, ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన బీజేపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తరహాలోనే రాష్ట్రాలలో కూడా అనేక పార్టీలు ఇలా అచరణ సాధ్యం కాని హామీలతో పాటు.. అచరించే హామీలను కూడా గుప్పించడం.. ప్రజలను తమ వైపుకు తిప్పుకోవడం పరిపాటిగా వస్తుంది.
ఇదే క్రమంలో త్వరలో ఎన్నికలకు సన్నధమవుతున్న కర్ణాటకలో ఓ పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలని అలోచించాడో.. లేక పార్టీ తరపున తనవారికి టిక్కట్ లభించాలనె అదికాకపోతే టిక్కెట్ వచ్చినా తమవారు గెలవాలని చేశాడో తెలియదు కానీ.. ఓ వ్యాపారవేత్త ఒక్కసారిగా స్థానిక మహిళలను అకర్షించేందుకు రెడీ అయ్యారు. అదెలా అంటే.. తిరుమల వెంకటేశ్వరస్వామి కలలో దర్శనమిచ్చి చెప్పారంటూ, 5 లక్షల చీరలను ఒక్కొక్కటీ రూపాయికే అమ్మడాన్ని ప్రారంభించాడు.
వివరాల్లోకి వెళ్తే, బీదర్ లోని ఓ వస్త్రదుకాణం యజమాని చంద్రశేఖర్, జేడీఎస్ పార్టీ వీరాభిమాని.ఈ సంవత్సరం జరిగే ఎన్నికల్లో జేడీఎస్ విజయం సాధించి, తమ నేత కుమారస్వామి మరోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించాలన్నది ఆయన కోరిక. కొద్ది రోజుల క్రితం వెంకన్న కలలోకి వచ్చి, కుమారస్వామి మళ్లీ సీఎం కావాలంటే, 5 లక్షల చీరలను పంచాలని చెప్పాడట. దీంతో కేవలం ఒక్క రూపాయికే చీరను విక్రయించాలని నిర్ణయించానని, 15 రోజుల పాటు మాత్రమే ఈ విధంగా చీరలను విక్రయిస్తామని ప్రచారం చేయడంతో ఆయన దుకాణం ముందు కీలోమీటర్ల దూరం పోడవునా మహిళలు బారులు తీరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more