తెలుగు తమ్ముళ్లు మరీ ముఖ్యంగా పార్టీ తరపున రానున్న అసెంబ్లీ ఎన్నికలలో టికెట్ అశిస్తున్న అశావహులలతో పాటు.. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కూడా వణుకు పుడుతుంది. పార్టీ నేత జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో తాము పార్టీకి ఎక్కడైనా, ఎప్పుడైన అసంతృప్తిని వ్యక్తం చేశామా..? అన్న కోణంలోనూ తెలుగు తమ్ముళ్లు అలోచనలో పడ్డారు. ఎవరి వద్దైనా మరీ ముఖ్యంగా పార్టీ నేతల వద్ద ఏ సందర్భంలోనైనా చులకనగా వ్యాఖ్యలు చేశామా అన్న విషయంలోనూ పార్టీ నేతలు పునారాలోచన చేసుకుంటున్నారు.
ఇంతలా పార్టీ నేతల సింహావలోకనం చేసుకునేందుకు కారణం ఏంటీ..? ఎన్నికలకు ఇంకా సమయం వుంది. ఈ లోపు ఎంతో కొంత పని చేసి.. ప్రజలను తమ వైపుకు తిప్పుకోవచ్చు అని భావిస్తున్న ఎమ్మెల్యేల ధోరణిలో ఎందుకు మార్పు వచ్చింది. పార్టీ నేతలు మారాలి.. మరీ ముఖ్యంగా పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో నిత్యం తిరుగుతూ ప్రజలతో సత్సంబంధాలను ఏర్పర్చుకోవాలి, వారి సమస్యలను పరిష్కరించాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నా.. దానిని అచరణలో పెడుతున్నవారి సంఖ్య తక్కువనే వినబడుతుంది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఎవరు ఏం తప్పులు చేస్తున్నారో తనకు తెలుసునని, వారందరి తప్పులనూ తాను చిత్రగుప్తుడి లెక్కలాగా చిట్టా రాస్తున్నానని హెచ్చరించడంతో తెలుగు తమ్ముళ్లలో వణుకు మొదలైంది. అయితే అధికారులను టార్గెట్ చేస్తూ తమ అధినేత చేసిన హెచ్చరికలు వారికి కాదని అవి తమకే వర్తిస్తాయని భుజాతు తడుముకుంటున్న పార్టీ నేతలు ఇక తమ పార్టీ మరోమారు అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ అధినేత ఈ తరహా హెచ్చరికలు జారీ చేయడం సాధారణమేనని కూడా తెలుగు తమ్ముళ్లు పేర్కొంటున్నారు.
కొందరు నాయకులూ మారేందుకు ఆసక్తిని చూపడం లేదని అన్నారు. వారిని ఏ విధంగా దారికి తీసుకురావాలో, వారిని ఎలా మార్చి పని చేయించాలో తనకు తెలుసునని అన్నారు. తమ ప్రభుత్వానికి ప్రజాబలం ఉందని, ఏ సమస్యపై అయినా, ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే, వాటి పరిష్కార బాధ్యత తనదేనని చెప్పారు. అధికారుల వెంటబడి మరీ పని చేయిస్తానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇకపై అన్ని కార్యాలయాల్లోనూ కంప్యూటర్ ద్వారా పనులు సాగుతాయని, దీనివల్ల పరిపాలనలో పారదర్శకతతో పాటు జవాబుదారీతనం పెరుగుతుందని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more