భక్తుల కొంగుబంగారమై బెజవాడ ఇంద్రకీలాద్రిలో వెలసిన కనకదుర్గమ్మ గర్భాలయంలో తాంత్రిక పూజలు నిర్వహించారన్న వార్తలు జోరందుకోగా, ఏకంగా విపక్ష పార్టీకి చెందిన అధికార ప్రతినిధి అంబటి రాంబాబు దానికి రాజకీయ టచ్ కూడా ఇవ్వడంతో రంగంలోకి దిగిన దేవాదాయ శాఖ అధికారులు మరింత అలస్యం చేయడం ఇష్టంలేక వెనువెంటనే చర్యలకు ఉపక్రమించారు. అలయంలో ప్రధానార్చకుడిపై బదిలీ వేటు వేశారు. దుర్గమ్మ అలయంలో పూజలు జరగలేదని వాదించిన ఈవో సూర్యకుమారీ.. ప్రధానార్చకుడిని బధరీనాథ్ బదిలీ ఎందుకు చేశారన్న విషయమై క్లారిటీ కూడా ఇవ్వాల్సిన పలువురు భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
నారా లోకేష్ ముఖ్యమంత్రి కావాలని స్వయంగా చంద్రబాబు అదేశాలతోనే అలయంలో తాంత్రిక పూజల నిర్వహణ జరిగిందన్న అంబటి అరోపణలపై మరో రూట్ లో ప్రయాణించకముందే చర్యలకు సిద్దమయ్యారు. గత నెల 26న అర్థరాత్రి వేళ అమ్మవారికి ప్రత్యేక అర్చనలు చేశారని, అమ్మవారిని మహిషాసుర మర్దనిగా అలంకరణ చేసి, తాంత్రిక పూజలను జరిపించడంతో పాటు, ప్రత్యేక నైవేద్యంగా కదంబాన్ని తయారు చేయించారని వచ్చిన ఆరోపణలపై ఎట్టకేలకు చర్యలు ప్రారంభమయ్యాయి.
తొలుత అటువంటిదేమీ లేదని, గుడిని శుభ్రం చేసేందుకే అనుమతించామని చెప్పిన ఆలయ ఈఓ సూర్యకుమారి, వీడియో ఫుటేజ్ లు బయటకు రావడం, అందులో కొత్త వ్యక్తులు కనిపించడంతో, మొత్తం ఘటనపై విచారణకు ఆదేశించామని, పూజల సమాచారం తెలిసిన వెంటనే ప్రధాన అర్చకుడు బదరీనాథ్ బాబుపై వేటు వేసి, కొండదిగువున ఉన్న కామధేను అమ్మవారి ఆలయానికి బదిలీ చేశామని వెల్లడించారు. ఆలయంపై వచ్చిన ఆరోపణల మీద దర్యాఫ్తు చేయించి, బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలియజేశారు.
అయితే పరమ పవిత్రమైన అలయంలో అర్చకులు తమంతట తాము నిర్ణయాలు తీసుకుని ఇలాంటి పూజలు, అందులోనూ అమ్మవారి ఆలయంలో తాంత్రిక పూజలు నిర్వహించడం సాధ్యం కాదని భక్తులు వాదిస్తున్నారు. అమ్మవారి ఆలయంలో ఇలాంటి పూజలు చేయాలని ఎవరో తెరవెనుకనున్న పెద్దమనుషలు అదేశాలు జారీ చేస్తే తప్ప.. వారు ఇలాంటి పూజలు జరిపించరని, అదేశాలు జారీ చేసిన పెద్దల గుట్టు బయటపెట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. దుర్గమ్మ అలయంలో అంశాన్ని పక్కదారి పట్టించేందుకే ప్రధానార్చకుడి బదిలీ అంటూ విమర్శలు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more