కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ గత ఏడాది నవంబర్ 8 న తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అనుకున్న మేర అశించిన అంచానాలను సాధించడంలో విఫలమైందన్న విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అటు విపక్షాలతో పాటు ఇటు అర్థిక నిపుణులు, విశ్లేషకులు కూడా ఇదే మాటను తేల్చి చెబుతున్నారు. దీనికి తోడు సొంత పార్టీకి చెందిన కేంద్ర మాజీ అర్థిక శాఖా మంత్రి యశ్వంత్ సిన్హా కూడా ఇదే విషయాన్ని నొక్కిచెప్పారు.
ఎవరెన్నీ విమర్శలు చేసినా.. పట్టనట్లు వ్యవహరిస్తున్న కేంద్రం.. నోట్ల రద్దు నిర్ణయంతో అప్పట్లో దేశ ప్రజలను మాత్రం బ్యాంకుల చుట్టూ తిరిగేలా.. పడిగాపులు కాసేలా చేసి.. తామేదో ఘనకార్యం సాధించినట్లు చెప్పుకోవడం మాత్రం మానలేదు. ఇక తాజాగా ఎఫ్ఆర్డీఐ (ఫైనాన్షియల్ రెజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్స్యూరెన్స్) బిల్లు విషయంలోనూ కేంద్ర అర్థిక మంత్రి అరుణ్ జైట్టీ స్వయంగా హామీలు ఇస్తున్నా.. ప్రజలు మాత్రం ఆయననే కాదు కేంద్రంలోని ప్రభుత్వాన్ని కూడా విశ్వసించే పరిస్థితిలో లేరు. దీంతో ఎవరి నిర్ణయం ఎలా వున్నా తమ సొమ్మ తమ వద్దే అట్టిపెట్టుకోవాలని ప్రజలు నిర్ణయం తీసుకుంటున్నారు.
అసలేంటీ ఎఫ్ఆర్డీఐ బిల్లు అంటారా..? దీని వల్ల ఏం జరుగుతుంది..? అంటారా..? కేంద్రం తాజాగా చేపట్టిన అర్థిక సంస్కరణల్లో ఎఫ్ఆర్డీఐ బిల్లు ఒక్కటి. అయితే ఇది అమలులోకి రావడంతో, బ్యాంకులు నష్టాల్లో వున్న సమయాల్లో తమ వద్ద డిపాజిట్ల రూపంలో వున్న డబ్బును అవి వాడుకునే వెసలుబాటు కల్పిస్తూ ప్రభుత్వం కొత్తగా ఎఫ్ఆర్డీఐ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. అయితే వాడుకున్న డబ్బును బ్యాంకులు తిరిగి ఇవ్వనూ వచ్చు.. లేదా ఇవ్వకపోవచ్చు.
అయితే తమ డబ్బు భద్రంగా వుంచేందుకు బ్యాంకుల్లో వేస్తున్నా.. అవి నష్టాల్లో వుంటే సోమ్ము తిరిగి వస్తుందా..? లేదా.? అన్న విషయంలో మాత్రం క్లారిటీ లేక వడ్డీ కాదు అసలుపై కూడా అనుమానాపు నీలినీడలు అలుముకోవడం.. ఈ మరేకు ప్రచారం జోరుగా సాగుతుండగా, ప్రజలు తీవ్ర ఆందోళనతో బ్యాంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. వరంగల్ లో నిన్న ఒక్కరోజులోనే రెండు బ్యాంకుల నుంచి రూ. 6 కోట్ల నగదు విత్ డ్రా కాగా, ఖాతాదారులకు నచ్చజెప్పలేక అధికారులు ఆపసోపాలు పడుతున్నారు.
తమ ఖాతాలను ఖాళీ చేస్తున్న ప్రజలు, డిపాజిట్లను సైతం వెనక్కు తీసుకుంటుండగా, ఈ ప్రచారం ఇతర పట్టణాలకూ పాకింది. ఈ ఉదయం పలు పట్టణాల్లోని బ్యాంకుల వద్ద జనం తమ డబ్బులను వెనక్కు తీసుకునేందుకు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక కొత్త చట్టం ఏమీ రాదని, ఎవరి డబ్బుకూ ఇబ్బంది ఉండదని బ్యాంకుల మేనేజర్లు చెబుతుంటే, ఇప్పటికి మాత్రం తమ డబ్బు వెనక్కు ఇవ్వాలని, అటువంటి బిల్లు రాకుంటే అప్పుడు తిరిగి డిపాజిట్ చేస్తామని ఖాతాదారులు చెబుతుండటం గమనార్హం.
వరంగల్ లోని ఓ బ్యాంకులో 30 వరకూ ఫిక్సెడ్ డిపాజిట్లు ఉండగా, అందులో 15 మంది తమ డబ్బును వెనక్కు తీసుకోవడం గమనార్హం. దిగువ, మధ్య తరగతి ప్రజలు అధికంగా బ్యాంకులకు వస్తున్నారని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. కాగా, వాట్స్ యాప్ లో జరుగుతున్న ప్రచారాన్ని చూసి తాము డబ్బు విత్ డ్రా కోసం వచ్చినట్టు పలువురు వ్యాఖ్యానించారు. ఇక ఇదంతా వదంతేనని, ఇటువంటి ప్రచారం తగదని, ఖాతాదారులను అయోమయంలో పడవేయవద్దని, ఈ ప్రచారాన్ని నమ్మవద్దని బ్యాంకుల అధికారులు కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more