హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవం అయ్యేందుకు ఇంకా మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న తరుణంలో.. ఇప్పటికే ఈ రైలుకు సంబంధించి ప్రత్యేకలకు సంబంధించి అనేక కథనాలు తెరపైకి రాగా, హైదరాబాద్ లో అర్టీసీ, ఎంఎంటీసీ సర్వీసులతో పాటు మెట్రో రైలు ప్రయాణాన్ని కూడా అనుసంధానం చేసేలా ఒకే స్మార్ట్ కార్డును అందుబాటులోకి తీసుకువస్తామని కూడా ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే చెన్నైలో మాత్రం అధికారులు మరో ముందడుగు వేశారు.
ఇకపై తమిళనాడు రాజధాని చెన్నైలో అనునిత్యం ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాలపై తిరిగే ప్రయాణికులకు ఎట్టకేలకు శుభవార్తను అందజేశారు. మెట్రో రైళ్లతో పాటు ఎంటీసీ బస్సుల్లోనూ ఒకే ఒక్ స్మార్ట్ కార్డుపై ప్రయాణించేలా ప్రయాణికులకు వీలుకల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం మార్చి నుంచి అమలులోకి రానుందని అధికారులు వెల్లడించారు. ఈ విషయమై మెట్రోరైలు సంస్థ అధికారులు, మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్టు అధికారులు మధ్య పలుసార్లు జరిగిన చర్చలు ఫలించాయి.
చెన్నై మెట్రోరైలు సంస్థ నిర్వహణ డైరెక్టర్ పంకజ్ కుమార్ మాట్లాడుతూ... ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు మెట్రోరైళ్లు, ఎంటీసీ బస్సుల్లోను ప్రయాణించేలా ‘స్మార్ట్ కార్డు’ను ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. ఇందుకోసం ఉభయ సంస్థల అధికారులు జరిపిన చర్యలు ఫలించగా, ప్రయోగాత్మకంగా నిర్వహించి పరిశీలన విజయవంతం అయిందని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పరికరాల తయారీకి చేపట్టామని, మార్చి నుంచి ఈ పథకం అమలులోకి రానుందని అన్నారు. ఈ కార్డులను ఎటీఎం కార్డుల ద్వారా రీఛార్జి చేసుకొనే సౌకర్యం ఉందని ఆయన తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more