విశాఖపట్నం జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఇవాళ అధికారికంగా తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అమె పార్టీలో చేరారు. ఇవాళ అమరావతికి వెళ్లిన ఈశ్వరి అక్కడే ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు అమెకు తమ పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. గిడ్డి ఈశ్వరితో పాటు సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరారు.
అభివృద్ధికి దూరంగా ఉన్న పాడేరు నియోజకవర్గానికి మరిన్ని నిధులను కేటాయించి, అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, అక్కడి ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి వుందని తెలిపారు. కాగా, 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరికి టికెట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు సమాచారం.
కాగా గిడ్డి ఈశ్వరి చేరికతో ఇప్పటివరకూ 22 మంది విపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. కాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. అయితే నలుగురిలో లేక ఐదుగురినో అయితే అధికారపక్షం అక్రమంగా లాగేసుకుందన్న వాదనను బలపర్చిన రాజకీయ విశ్లేషకులు.. ఏకంగా మూడేళ్ల తరువాత కూడా ఎమ్మెల్యేలు ఇలా అధికారపార్టీలోకి వలసవెళ్లడంపై కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more