గత అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీయేతర శక్తులన్నీ కూటమిగా ఏర్పడి మహా కూటమి పేరుతో అధికారాన్ని సాధించుకున్నా.. నితీష్ కుమార్ అధ్వర్వంలోని జేడీయు మాత్రం కొంత బిన్న స్వరాన్ని అలపించి.. కేంద్రంలోని అధికార బీజేపితో జతకట్టి కూటమి మిత్రులకు వెన్నుపోటు పోడిచిన నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలలో విజయం కోసం ఇప్పట్నించే పావులు కదుపుతున్న అర్జేడీ తమ సీఎం అభ్యర్థిని కూడా ప్రకటించేసింది.
2020లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో లాలూ ప్రసాద్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. పార్టీ సీనియర్ నేతలు అబ్దుల్ బరి సిద్ధిఖి, రఘువంశ్ ప్రసాద్ సింగ్ లతో సమావేశం తన చిన్న కుమారుడు, బీహార్ మాజీ డిఫ్యూటీ ముఖ్యమంత్రి తేజస్వియాదవ్ ను ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడు సమర్థత కలిగిన నేతగా, పరిణితి చెందిన నాయకుడిగా ఎదిగాడని కూడా అన్నారు.
2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు తేజస్వి యాదవ్ తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీని ముందుండి నడిపిస్తారని స్పష్టం చేశారు. తన కుమారుడు తేజస్వి పార్టీకి అందిస్తోన్న సేవలు అద్భుతమని కొనియాడారు. తేజస్వి యాదవ్ బీహార్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ బీహార్ ప్రజలు ఇపట్నించే మాట్లాడుకోవడంలో తప్పు ఏముందని కూడా ఆయన ప్రశ్నించారు. ఇది తన నిర్ణయం కాదని పార్టీ నేతలు నిర్ణయమని చెప్పుకోచ్చారు.
అంతకుముందు ఆర్జేడీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ పుర్వే బీహార్ తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ పేరును ప్రతిపాదించగా దాన్ని ఇతర నేతలు కొందరు వ్యతిరేకించారు. తేజస్వి యాదవ్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన అంశంపై ఆర్జేడీ నేతల్లో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఎన్నికలకు ఇంకా మూడేళ్ల కాలం వున్న నేపథ్యంలో అప్పటి వరకు పార్టీలోని వ్యతిరేక గొంతులన్నీ ధోరణి మార్చుకుంటాయన్న అభిప్రాయాలను కూడా పార్టీ వ్రర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more