హైదరాబాద్ నగరవాసులు ఎప్పుడెప్పుడా అంటూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన క్షణాలు ఈ నవంబర్ తో బ్రేకులు పడునున్న నేపథ్యంలో మరో ప్రశ్న తెరపైకి వచ్చింది. ఇప్పటికే అటు ఎంఎంటీఎస్ రైలుతో పాటు ఇటు అర్టీసీ బస్సులను అనుసంధానం చేస్తూ కామన్ టికెట్ లను తీసుకురావాలని ఓ శుభవార్తను ఇప్పటికే హైదరాబాదీలకు చేరవేసి సంతోషాన్ని నింపిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇక మరో విషయంలో కూడా హైదరాబాదీ ప్రయాణికులు ఇబ్బందులకు గురికాకూడదని చర్యలు ముమ్మరం చేసింది.
అదే మెట్రో రైలులో ప్రయాణించాలంటే కనీస టిక్కెట్ దర ఎంత వుంచాలన్నది ఇప్పడు చర్చిస్తుంది. దేశరాజధాని ఢిల్లీలో వున్నట్లుగా రూ. 10నే పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక మరోవైపు ఎంఎంటీఎస్ దరలను పరిశీలిస్తే గరిష్టంగా వున్న రేటు రూ.10. ఇక అర్టీసీ బస్సుల్లో మినిమమ్ టిక్కెట్ ధర పరిశీలిస్తే అది రూ.7గా వుంది., దీంతో రూ. 10నే కనిష్ట ధరగా ప్రతిపాదించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
మెట్రో ముఖ్యఉద్దేశ్యం ట్రాఫిక్ నియంత్రణ. కాలుష్య నియంత్రణ.. దీంతో అత్యధికులు మెట్రో సేవలను వినియోగించుకోవాలంటే కనీస దరను రూ. 10గానే నిర్థారించాలని పలువురు అధికారులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. అయితే గరిష్ట ధర మాత్రం వారి దూరం నిడివిని బట్టి మారుతుందని మెట్రో రైలు అధికారులు ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చిరు. అయితే గరిష్టంగా వుండే ధర మాత్రం రూ. 30 మించి వుండరాదన్న వాదనలు వినిపిస్తున్నా.. నలబై రూపాయాలుగా కూడా నిర్ధారించవచ్చునని పలువురు అభిప్రాయపడుతున్నారు. నవంబర్లో మెట్రో రైలు ప్రారంభం నాటికి మెట్రో చార్జీలపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more