బిహార్ రాష్ట్రంలో జేడియు పార్టీ అధికారంలో వచ్చేందుకు దోహదం చేసిన మహాగట్ బంధన్ తన సొంత బిడ్డలాంటిదని, తన బిడ్డను తానే ఎందుకు చంపుతానని ప్రశ్నించిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన బిడ్డను చంపడమే కాకుండా.. 24 గంటల వ్యవధిలో మరో బంధానికి తోడుచేసుకుని తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, మాజీ డిఫ్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తానెంతో ఇష్టపడి మార్పు చేర్పులు చేయించుకున్న పాట్నా, సర్క్యులర్ రోడ్ లోని 5వ నంబర్ బంగళా, 'పలాటియల్'ను తనకే కేటాయించాలని కోరుతూ సీఎం నితీశ్ కుమార్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే,
గతంలో ఈ భవనాన్ని అప్పటి డిప్యూటీ ముఖ్యమంత్రి సుశీల్ మోడీ ఖాళీ చేయకపోవడంతో.. దానిని అతనికే కేటాయించిన విషయాన్ని కూడా తేజస్వీ యాదవ్ ప్రస్తావించారు. అయితే తేజస్వీ యాదవ్ వినతిని మాత్రం నితిష్ కుమార్ నిద్వందంగా తోసిపుచ్చారు. ఈ భవనాన్ని ఖాళీ చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. తేజస్వి ఈ బంగళాను ఎంచుకుని, దానికి ప్రజాధనంతో మరమ్మతులు, అదనపు హంగులు కల్పించుకున్నారు. కాగా శరవేగంగా మారిన బిహార్ రాజకీయ పరిణామాల నేపథ్యం ఉపముఖ్యమంత్రి పదవికి దూరమైన తేజస్వీ.. భవనాన్ని కూడా ఖాళీ చేయాల్సిన అవసరం ఏర్పడింది.
అయితే తానెంతో శ్రమించిన సాధించుకున్న పదవి పోయినా కనీసం ఇష్టపడిన మరమ్మతులు చేయించుకున్న భవనానైనా తనకే కేటాయించాలని విన్నవించినా అ కోరిక మాత్రం తీరని కోరికగానే మిగులుతుంది. తేజస్వీ వినతిపై స్పందించిన నితీశ్, ఈ పని చేసి పెట్టడం తన వల్ల కాదని, అందుకు తనను క్షమించాలని చెప్పారు. దీంతో పాటు ప్రభుత్వ ఆస్తులపై ఎవరూ వ్యక్తిగత అనుబంధాన్ని పెంచుకోరాదు. నేనీవేళ ముఖ్యమంత్రిగా ఉండవచ్చు. కానీ నా పదవి కూడా శాశ్వతం కాదని నితీశ్ ఉచిత సలహాలు కూడా ఇచ్చాడట. దీంతో మరి తేజస్వి ఈ భవనాన్ని ఖాళీ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు ఖాళీ చేస్తోరో వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more