గో రక్షకులు పేరుతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో దళితులు, ముస్లింలపై జరుగుతున్న దాడులను నియంత్రించాలని స్వయంగా దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అమేరకు చర్యలను ప్రారంభించాయి. ఇకపై గో రక్షకులను అధికారంకంగా ప్రభుత్వమే ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలోని గోవులను కబేళాలకు తరలించకుండా అడ్డుకునేందుకు ఏర్పడిన గో రక్షకులు ఇకపై దాడులకు తెగబడకుండా, వారి పనులను శాంతియుతంగానే చేయనున్నారు. ఇందుకోసం హర్యానా, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చాయి. గోవుల తరలింపు, దాడులపై సీరియస్ గా స్పందించిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కమిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాయి.
ఇకపై గో రక్షకులకు అధికారిక హోదాను కల్పించనున్నాయి ఆయా ప్రభుత్వాలు. అదెలా అంటే ఇక గో రక్షకులకు అధికారికంగా గుర్తించేందుకు ప్రభుత్వాలు గుర్తింపు కార్డులను జారీ చేయనున్నాయి. హర్యానాలో ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైంది. హర్యానా గోవుల సంరక్షణ – సేవా సంస్థ చైర్మన్ భనిరామ్ ఈ విషయాన్ని నిర్ధారించారు. అన్ని జిల్లాల నుంచి దరఖాస్తులను ఆహ్వానించామని.. పరిశీలన తర్వాత గోరక్ష్ పేరుతో కార్డులు ఇస్తామన్నారు. తొమ్మిది జిల్లాల నుంచి 275 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటికే 80 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు.
గో హింస, తరలింపులను పరిశీలిస్తారని.. గొడవలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటారని ఆయన తెలిపారు. ఇక ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు మొదలుపెట్టింది. 13 జిల్లా నుంచి గో రక్షక్ జాబితా సిద్ధం చేయాలని జంతు హింస నిరోధక సభ్యుల సంఘాన్ని రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లు కోరారు. వారి వినతి మేరకు గో రక్షకుల జాబితాను సిద్దం చేసి వారికి గుర్తింపు కార్డులను జారీ చేసే ప్రక్రియను మొదలు పెట్టనున్నారు. ఈ గుర్తింపు కార్డులను ఆధార్ తో అనుసంధానం చేయనున్నారు. దీంతో నకిలీ గోరక్షకులను నియత్రించడం సులభతరం అవుతుందని కూడా జంతుహింసా నిరోధక సభ్యుల సంఘం డైరెక్టర్ నరేంద్ర రావత్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more