అసెంబ్లీ అంటే చట్టసభ. అలాంటి చట్టసభ సాక్షిగా.. అధికార పక్షానికి చెందిన సభ్యుడు, రాష్ట్ర మంత్రి ఏకంగా అబాసుపాలు చేస్తున్నారు. ప్రతిపక్షానికి చెందిన ఓ చట్టసభ సభ్యుడుని సభలోనే చంపిపారేస్తానని హెచ్చరించారు. ఐదేళ్లకో పర్యాయం ప్రజల ఓట్ల ద్వారా నెగ్గి చట్టసభల్లోకి వెళ్లే సభ్యుడు.. చట్టసభనే అవహేళన చేసే విధంగా ప్రపర్తిస్తూ.. ప్రజాస్వామ్యానికి అపఖ్యాతిని అంటగడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జమ్మూకాశ్మీర్ మంత్రి ఇమ్రాన్ అన్సారీ ప్రతిపక్ష పార్టీ నేత దేవేందర్ రాణాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
చట్టసభలోనే చంపి పాతరేస్తానంటూ ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడటంతో.. సభలో తీవ్ర గంధరగోళ పరిస్థితులు తలెత్తాయి. తక్షణం మంత్రి బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్షానికి చెందిన సభ్యులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఏకీకృత పన్నువిధానం అమలవుతున్న క్రమంలో జమ్మూకాశ్మీర్ లో మాత్రం జీఎస్టీ విధానాన్ని ఎందుకు అముల చేయడంలేదన్న విషయమై అసెంబ్లీలో జరిగిన చర్చ చివరకు వ్యక్తిగత బెదిరింపులకు దారితీసింది. అయితే మంత్రి వ్యాఖ్యలకు నోచ్చుకున్న స్పీకర్ వెంటనే మంత్రి తరపున క్షమాపణలు చెప్పారు.
దేశవ్యాప్తంగా ఏకీకృత పన్నువిధానాన్ని అమలుపరుస్తుండగా, తమ రాష్ట్రంలో మాత్రం జీఎస్టీ అమలు చేయడం లేదని, అసలు జీఎస్టీ బిల్లును అధికార పక్షం అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ నేత దేవేందర్ రాణా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన చర్చలో ఆసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే అధికార పక్షం నుంచి అయన మాట్లాడుతున్నంత సేపు పన్నులు ఎగ్గోట్టిన వారే జీఎస్టీ అమలు గురించి అడుగుతున్నారంటూ అరోపణలు వినిపించాయి.
వాటిపై ఆయన బదులిస్తూ తాను పన్నులు ఎగ్గొట్టలేదని, చీకటి వ్యాపారాలు చేయాల్సిన కర్మ తనకు పట్టలేదని అధికార పక్ష నేతలకు బదులిచ్చారు. ఓ వైపు ఎమ్మెల్యే రాణా మాట్లాడుతుండగా.. రాష్ట్ర ఐటీ, సాంకేతిక విద్య శాఖలమంత్రి ఇమ్రాన్ అన్సారీ కలుగజేసుకుని తాను తలుచుకుంటే దేవేందర్ రాణాను ఇక్కడే చంపేయగలను అని బెదిరించారు. ఆయన దొంగ వ్యాపారాలన్నీ తనకు తెలుసునన్నారు. రాష్ట్రంలో రాణా కంటే పెద్ద దొంగ ఎవరూ లేరని విమర్శించారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీలోనే మంత్రి చేసిన తీవ్ర వ్యాఖ్యలపై బేషరుతు క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా రాణా మాత్రం మంత్రి అన్సారీపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more