జగన్ ఛాంబర్ లో వర్షపు నీరు లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య విమర్శలు శృతిమించుతున్నాయి. ఒకానోక టైంలో వైకాపా అధినేత వైఎస్ జగన్ ను హత్య చేసేందుకు యత్నిస్తున్నారంటూ ఆరోపణలు లేవనెత్తారు. విద్యుత్ షార్ట్ సర్య్కూట్ తో జగన్ ను హత్య చేసేందుకు కుట్ర పన్నారని ఫైర్ బ్రాండ్ రోజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. అయితే అలాంటి అవసరం తమకు ఏ కోశాన కూడా లేదని టీడీపీ నేత, ఏపీ పౌరసరఫరాల సంస్థ చైర్మన్ ఎం లింగారెడ్డి వ్యాఖ్యానించాడు.
అనుమానాలు ఉన్నప్పుడు వైకాపా స్వయంగా ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నిస్తూ వైసీపీ వ్యవహర శైలిపై అనుమానం వ్యక్తం చేశాడు. ఓ అసమర్థ నేత విపక్షంలో ఉండగా, తమకెంతో లాభం కలుగుతోందనే టీడీపీ భావిస్తోందన్నాడు. అసలు జగన్ ను అడ్డు తొలగించుకునేందుకు వైకాపా నేతలే కుట్రలు చేసి వుంటారన్న అనుమానం తమకుందని చెప్పాడు. ఇక దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి భూమన కరుణాకర్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేయటంపై కూడా విరుచుకుపడ్డాడు.
చనిపోయిన ఎనిమిదేళ్ల తర్వాత సందేహాలు వ్యక్తం కావటం ఏంటని ప్రశ్నించాడు. ఇక తండ్రి మరణించగానే పదవీ కోసం శవ రాజకీయాలు చేసిన ఘనత జగన్ దేనని దుయ్యబట్టారు. వైకాపా నేతలు ఉద్యోగులను బెదిరిస్తున్నారని, గనుల కాంట్రాక్ట్ దక్కలేదన్న అక్కసుతోనే చెవిరెడ్డి చౌకబారు ఆరోపణలకు దిగుతున్నారని ఆరోపించిన లింగారెడ్డి, అధికారులను భయపెట్టే సంస్కృతి వైకాపాదేనని, విచారణలో అసలు నిజాలు వెలుగు చూస్తాయని తెలిపాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more