దేశంలోని ఇకపై డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు అటు రిజర్వు బ్యాంకుతో పాటు ఇటు కేంద్ర ఆర్థిక శాఖ కూడా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తూ.. వారికి పెద్ద ఎత్తున బహుమతులను కూడా ప్రకటిస్తుండగా, అతిపెద్ద బ్యాంకింగ్ సేవల సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం అందుకు పూర్తి భిప్నంగా వ్యవహరిస్తూ.. నేటి నుంచి కొత్త చార్జీలను అమలు పరుస్తుంది. డిజిటల్ సహా నగదు లావాదేవీలు జరిపే కస్టమర్ల జేబులకు అదనపు చార్జీల పేరుతో చిల్లులు పెడుతుంది.
అయితే ఈ కొత్త చార్జీలను ఇప్పటికే ప్రకటించిన ఎస్బీఐ.. వాటిని నేటి నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. మొబైల్ యాప్ 'ఎస్బీఐ బ్యాంక్ బుడ్డీ'తో నగదు విత్ డ్రా, తదితరాలకు కొత్త చార్జీలు అమలులోకి వచ్చాయి. ఇందులో భాగంగా, మొబైల్ వాలెట్ ను వాడి ఏటీఎం నుంచి డబ్బును తీసుకుంటే, ఒక్కో లావాదేవీకి రూ. 25 రూపాయలను వసూలు చేస్తారు. ఇక సాధారణ సేవింగ్స్ ఖాతాలపై మెట్రో నగరాల్లో ఎనిమిది ఉచిత ఏటీఎం లావాదేవీలు (ఎస్బీఐ ఏటీఎంలలో 5, ఇతర ఏటీఎంలలో 3) కొనసాగుతాయి. నాన్ మెట్రో ఏటీఎంలలో 10 ఉచిత లావాదేవీలకు అనుమతి వుంటుంది.
కొత్త వడ్డింపుల్లో భాగంగా, అత్యవసర చెల్లింపు సేవలను వాడుకునే కస్టమర్లపై బ్యాంకు చార్జీలతో పాటు సేవా పన్నను కూడా వడ్డించనున్నారు. ఈ సర్వీసులను వినియోగించుకునే కస్టమర్లు లక్ష రూపాయల వరకూ బదిలీ చేస్తే 5 రూపాయలు చార్జీ.. దీనికి అదనంగా సేవా పన్ను, రూ. 2 లక్షల వరకూ లావాదేవీపై 15 రూపాయలు చార్జీతో పాటు సేవా పన్ను.. 5 లక్షల రూపాయల వరకూ డబ్బును బదిలీ చేస్తే 25 రూపాయలు ప్లస్ సర్వీస్ టాక్స్ ను బ్యాంకు వసూలు చేస్తుంది.
ఇక మరో తాజా నిర్ణయం కూడా ఎస్బీఐ తీసుకుంది. ఇకపై పాడైపోయిన నోట్లను మార్చుకుని కొత్త నోట్లను తీసుకోవాలంటే కూడా చేతి చమురు వదలాల్సిందే. పాత నోట్లు మార్చుకునే వాటి విలువ మొత్తం రూ. 5 వేల కన్నా ఎక్కువ లేదా 20 నోట్లు ఉంటే, ఒక్కో నోటుకు రెండు రూపాయలతో పాటు సేవా పన్నును కూడా వసూలు చేస్తుంది. ఇక కొత్త చెక్ బుక్ కావాలంటే రూ. 30 (10 చెక్కులు), రూ. 75 (25 చెక్కులు), రూ. 150 (50 చెక్కులు)కి తోడు అదనంగా సేవా పన్నును చెల్లించాల్సిందే. ఇక సాధారణ సేవింగ్స్ డిపాజిట్ ఖాతా కలిగివున్న వారు ఉచిత లావాదేవీల తరువాత, ఎస్బీఐ బ్యాంకు ఏటీఎంను వాడి డబ్బు తీసుకుంటే రూ. 20కి బదులు ఏకంగా రెండున్నర రెట్టు చార్జీని పెంచి రూ. 50 చెల్లించుకోవాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more