జగన్ మోదీ కలవటంపై తీవ్ర విమర్శలు చేసిన కొందరు టీడీపీ నేతలు తర్వాత మిత్రపక్షం బీజేపీని టార్గెట్ చేశారు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకుండా ఉంటే భారీ మెజార్టీతో గెలిచేవాళ్లమని విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలమే రేపాయి. 2019 బీజేపీ-టీడీపీ పొత్తుపై ఆయన వ్యాఖ్యలు పెను ప్రభావం చూపుతాయన్న రాజకీయ పరిశీలకుల అభిప్రాయాల నేపథ్యంలో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది.
జిల్లా అధ్యక్షుల ఎంపిక సమావేశంలో పార్టీ నేతలు హద్దుల్లో ఉండాలని హెచ్చరించాడని చెబుతున్నారు. గీత దాటి వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలుంటాయని, తాను సమస్యలు పరిష్కరిస్తూ వస్తుంటే, కొందరు కొత్త సమస్యలు కొనితెస్తున్నారంటూ పరోక్షంగా కేశినేనిపై మండిపడ్డట్లు సమాచారం. నేతలు పరిధులు దాటి మాట్లాడడం వల్ల పార్టీకి నష్టం జరిగితే చూస్తూ ఊరుకోనని పార్టీ నేతలకు నేరుగానే హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు టీటీడీపీ నేతలకు కూడా ఇదే సూచన చేసిన విషయం తెలిసిందే.
ఇక కేశినేని మాటలపై బీజేపీ గుర్రుగా ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో కొనసాగుతున్న టీడీపీ, బీజేపీ పొత్తు కొనసాగుతుందో, లేదో చెప్పలేమంటూ ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశాడు. టీడీపీ నేతలు ఏం మాట్లాడినా చంద్రబాబు అడ్డుకట్ట వేయడం లేదని, తాము గట్టిగా స్పందిస్తే మాత్రం ఆ తరువాత బీజేపీ నేతల గురించి మాట్లాడవద్దని చెప్పి వదిలేస్తున్నారని ఆరోపించాడు. ప్రస్తుతం పార్టీ క్షేత్ర స్థాయిలో బలంగా ఉందని, అమిత్ షా పర్యటన తర్వాత మరింత పుంజుకునే అవకాశం ఉందని చెప్పాడు. మిత్ర ధర్మాన్ని టీడీపీ విస్మరించిందన్న వీర్రాజు, 2019 ఎన్నికల్లో ఏం జరుగుతుందో ఇప్పుడే ఎవరమూ చెప్పలేమని వ్యాఖ్యానించటం కొసమెరుపు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more