'గూఢచారి' ముద్ర వేసి ఉరిశిక్ష విధించిన భారత నేవీ మాజీ ఉద్యోగి కుల్ భూషణ్ జాదవ్ ఉరిపై పాకిస్థాన్ కు అంతర్జాతీయ న్యాయస్థానంలో దిమ్మతిరిగి బొమ్మ కనబడింది. అయితే అక్కడి మీడియా మాత్రం ఈ విషయాన్ని కనీసం ఉన్నది వున్నట్లుగా కూడా చెప్పలేకపోయింది. ఈ విషయంలో పాకిస్థాన్ మీడియా పై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కోంటుంది. గూఢచర్యానికి పాల్పడ్డాడని పాక్ ఆర్మీ న్యాయస్థానం ఆరోపిస్తూ కుల్ భూషణ్ జాదవ్ కు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే.
అదే సమయంలో అంతర్జాతీయ న్యాయస్థానం కుల్ భూషణ్ జాదవ్ వై విధించిన స్టేను ప్రచురించని అక్కడి మీడియా.. ఏకంగా అంతర్జాతీయ న్యాయస్థానం పరిధిలోకి పాకిస్థాన్ రాదని, దీంతో తమ న్యాయస్థానం విధించిన తీర్పును సవాల్ చేయడంలో కానీ, కనీసం ప్రశ్నించడం, స్టే విధించే వ్యవహారంలో అంతర్జాతీయ న్యాయస్థానానికి అసలు స్టే విధించే అవకాశం కూడా లేదని కుల్ భూషణ్ వ్యవహారాన్ని ప్రచురించిన ఒకటి రెండు మీడియా సంస్థలు కూడా ఇలా విషాన్ని కక్కాయి. ఇక జీయో టీవీ కాని, డాన్ అన్ లైన్ కానీ అసలు ఈ విషయాన్ని రిపోర్టు కూడా చేయలేని దుస్థితిలోకి జారుకున్నాయి.
అయితే కుల్ భూషణ్ జాదవ్ వ్యవహారంలో న్యాయంకోసం ఎంత దూరమైనా వెళ్తామన్న భారత్ అతనికి పాకిస్థాన్ లోని ఆర్మీ కోర్టు విధించిన తీర్పును సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని అశ్రయించింది. కాగా పాకిస్తాన్ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై అంతర్జాతీయ కోర్టు స్టే విధించింది. ఈ సందర్భంగా భారత్ పాక్ లోని న్యాయవాదులెవరూ కుల్ భూషన్ జాదవ తరపున వాదించకూడదని నిర్ణయించారని కూడా పేర్కొంది.
వ్యాపారం పనిపై ఆఫ్ఘనిస్థాన్ కు వెళ్లిన కుల్ భూషన్ జాదవ్ ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి, పాక్ సైన్యానికి విక్రయించారని, ప్రతిగా ఉగ్రవాదులను విడిపించుకుని, నిధులు పొందారని భారత్ ఆరోపించింది. ఈ మేరకు అవసరమైన సాక్ష్యాలు అంతర్జాతీయ న్యాయస్థానంలో చూపించడంతో కుల్ భూషణ్ జాదవ్ పై పాకిస్థాన్ సైనిక న్యాయస్థానం విధించిన ఉరిశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది. దీంతో పాక్ షాక్ తింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more