వైద్యో నారాయణో హరి అంటూ వైద్యుడ్ని నారాయణుడు లేదా భగవంతుడితో పోల్చుతున్నా.. వైద్యులు మాత్రం తమ నిర్లక్షపు వైఖరిని వీడటం లేదు. రోగులు మరణించిన క్రమంలో మృతదేహాలను తరలించేందుకు అంబులెన్సు సర్వీసులను కావాలా అని విచారించి.. వారికి సాయం అందించాల్సిన వైద్యులు..మృతుల కుటింబికులు కోరినా.. వారికి అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించకపోవడం లేదు. దీంతో మృతుడి బంధువులు తమవారి బౌతిక ఖాయాలను భుజాలపై వేసుకోని, కొందరు సైకిళ్లపై వేసుకుని తీసుకెళ్లిన అనేక ఘటనలు ఒడిశా లాంటి రాష్ట్రాల్లో అప్పడప్పుడూ వార్తలుగా నిలుస్తున్నాయి.
అయితే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఈటావా జిల్లాలో చోటుచేసుకుంది. ఒడిశాలోని దానా మాంఝీ ఎదుర్కోన్న విపరీత పరిస్థుతులను ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఉదయ్ వీర్ అనే దినసరి కూలీ కూడా అనుభవించాడు. తన 15 ఏళ్ల కొడుక్కు పుప్ఫేంద్ర కాళ్ల నోప్పితో బాధపడుతుండటంతో ఆయన తండ్రి ఉదయ్ వీర్ ఈటావా జిల్లాలోని అస్పత్రికి తీసుకువచ్చాడు. అయితే అక్కడే చికిత్స సోందుతూ పుష్పేంద్ర మరణించాడు. కాళ్లనోప్పితో వచ్చిన ఫుష్పేంద్ర శరీరంలో ఏ అవయవాలు సరిగాలేవని వైద్యులు తలిపారు.
కాగా, కొడుకు మరణంతో పుట్టెడు దు:ఖంలో వున్న ఉదయ్ వీర్.. అక్కడే వున్న అస్పత్రి సిబ్బందితో పాటు వైద్యులను కూడా తనకు సాయం చేయాలని కోరాడు. తన కోడుకు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు సాయం చేాయలని అందుకు అంబులెన్సును పంపాల్సిందిగా కూడా కోరాడు. కానీ వైద్యలు అందుకు నిరాకరించడంతో తన బిడ్డ మృతదేహాన్ని తన భుజాలపై మోసుకెళ్తూ చిన్నపిల్లాడి కన్నా అద్వానంగా కన్నీరు మున్నిరుగా విలపించాడు.ఇది చూసిన స్థానికులు ఆ దృశ్యాలను ఫోటో తీయడంతో అది కాస్తా వైరల్ న్యూస్ గా మారింది.
దీనిపై స్పందించించి ఈటావా జిల్లా వైద్యాధికారి రాజీవ్ యాదవ్ స్పందిస్తూ ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా హేయకరమైందని అభివర్ణించారు. అయితే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని చెప్పారు. ఇది అస్పత్రి వర్గాల తప్పిదమేనని చెప్పిన ఆయన ఇందుకు బాధ్యలైనవారు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే అదే రోజున జరిగిన బస్సు ప్రమాద బాధితులతో అస్పత్రి పూర్తిగా విషాధచాయలతో నిండుకున్న నేపథ్యంలోనే బాధితుడ్ని అస్పత్రి వైద్యలు అంబులెన్స్ కావాలా..? అని విచారించలేకపోయారని రాజీవ్ యాదవ్ అన్నారు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more