ఒకప్పుడు విమానయాన రంగంలో సంచలనం సృష్టించిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కుప్పకూలిపోవడానికి లోపాలున్న విమాన ఇంజన్లు కూడా ఒక కారణమని లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా అన్నారు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కు లోపాలున్న ఇంజన్లను సరఫరా చేసినందుకు పరిహారం చెల్లించాలని ప్రాట్ అండ్ విట్నీకి చెందిన ఐఈపై దావా వేసినట్టు ఆయన గుర్తు చేశారు. ప్రాట్ అండ్ విట్నీ విమాన ఇంజన్లపై డిజిసిఎ దర్యాప్తు చేపట్టడం తనకేమీ ఆశ్చర్యం కలిగించడం లేదని విజయ్ మాల్యా ట్వీట్ చేశారు. లోపాలున్న ఇంజన్ల వల్ల దురదృష్టవశాత్తు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కుప్పకూలిపోయిందని ఆయన పేర్కొన్నారు.
ఎయిర్బస్ 320 నియో విమానాల్లో ఉపయోగిస్తున్న ప్రాట్ అండ్ విట్నీ ఇంజన్లపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని విమానయాన రంగ నియంత్రణ సంస్థ డిజిసిఎ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మాల్యా ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం తీసుకున్న రుణాలను మాల్యా ఎగవేసిన విషయం తెలిసిందే. ఫలితంగా ఈ సంస్థ 2012 సంవత్సరంలో మూతపడింది. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించక డిఫాల్టర్గా మారిన మాల్యా ప్రస్తుతం బ్రిటన్లో నివసిస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. మాల్యా నిధుల బదిలీపై విచారణ విజయ్ మాల్యా తన పిల్లలకు 4 కోట్ల డాలర్ల సొమ్మును బదిలీ చేసినట్టు ఆరోపిస్తూ బ్యాంకుల కన్సార్షియం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఈ నెల 9న సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ సొమ్మును వెనక్కి తెప్పించాలని బ్యాంకులు కొంతకాలంగా కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు బ్యాంకుల కన్సార్షియం తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ సమర్పించిన వ్యాజ్యాన్ని జస్టిస్ అదర్ష్ కుమార్ గోయెల్, యుయు లలితల సారథ్యంలోని బెంచ్ విచారణకు స్వీకరించింది. బ్రిటిష్ సంస్థ డియాజియో నుంచి గత ఏడాది ఫిబ్రవరిలో పొందిన సొమ్మును మాల్యా న్యాయస్థానాల ఆదేశాలకు విరుద్ధంగా తన పిల్లలకు బదిలీ చేసినట్టు బ్యాంకులు ఆరోపించాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more