కర్ణాటకలో అప్పుడే అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటుంది. మరో ఏడాదికాలంలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగునున్న తరుణంలో అధికార అందుకోవాలని అశించే పార్టీలు ప్రత్యర్థి పార్టీపై ఇప్పటి నుంచే విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టాయి. ఈ క్రమంలో ఏకంగా అధికార కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవిని కాపాడుకోవడానికి చేయని పని లేదంటూ విరుచుకుపడ్డారు.
అంతటితో ఆగకుండా సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పీఠం అందుకోవడం కోసం కాంగ్రెస్ పెద్దలకు రూ. వెయ్యి కోట్లు ఇచ్చారని సంచలన ఆరోపించారు. వాటిని తిరిగి సంపాదించేందుకు చేయకూడని పనులను ముఖ్యమంత్రి హోదాలో చేస్తున్నారని అరపించారు. సిద్ధరామయ్యకు ప్రధాన అనుచరుడైన ఎమ్మెల్సీ గోవిందరాజు ద్వారా కోట్ల రూపాయాలు కాంగ్రెస్ పెద్దలకు ముట్టజెప్పినట్లు తెలిపారు. అంతేకాకుండా సిద్ధరామయ్యకు సంబంధించిన పలు ఒప్పందాల్లో గోవిందరాజు సహాయం చేశారని పేర్కొన్నారు. సీఎం వ్యవహారాలపై త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు.
ఇదిలావుంటే సిద్దరామయ్య కోట్ల రూపాయాలు ఒప్పందాలను ఎవరితో చేసుకున్నారన్న ప్రశ్నలను మీడియా ప్రతినిధులు సంధించగానే ఆయన నీళ్లు నమిలారు. మీడియా ప్రతినిధులు మాత్రం ఆయనపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ఎవరితో ఒప్పందాలు చేసుకున్నారన్న విషయాన్ని చెప్పకపోయినా పర్వాలేదు కనీసం కోట్ల రూపాలయను తీసుకున్న కాంగ్రెస్ పెద్దల పేర్లయినా చెప్పండీ అన్న మీడియా ప్రతినిదుల ప్రశ్నలను యడ్డీ నిరాకరించారు.
కాగా యడ్యూరప్ప విమర్శలను కాంగ్రెస్ నేతలు ధీటుగానే తిప్పకోట్టారు. డబ్బులకు ముఖ్యమంత్రి పీఠాలను అమ్ముకునే సంస్కృతి వున్న పార్టీలో వున్నవారికే ఆ విషయాలు బాగా తెలుస్తాయని, అలాంటి అరోపణలు కూడా చేస్తారని దుయ్యబట్టారు. తమ పార్టీలో నీతి, నిబద్దత, నిజాయితీ, కార్యదీక్ష వున్నవారికి పదవులు అవే వస్తాయని, అలాంటి లక్షణాలను పునికిపుచ్చుకున్న నాయకుడే తమ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అని కాంగ్రెస్ ధీటుగా బదులిచ్చింది. గతంలో ముఖ్యమంత్రిగా బాద్యతలు నుంచి యడ్యూరప్పను బీజేపి తొలగించడానికి అసలు కారణం బీజేపి కేంద్రనాయకత్వం అడిగిన డబ్బులను ఇవ్వలేకనేనా.. అందుకనే అక్రమ గనులు కేసులలో చిక్కకున్నారా.. అంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నలు కురిపిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more