బెంగళూరు సిటీలో పట్టపగలు నట్టనడి వీధిలో కాల్పలు కలకలం రేపాయి. పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. నగర శివార్లలోని ఓ కారును లక్ష్యంగా చేసుకుని మోటార్ సైకిల్ (పల్సర్ బైక్) పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని అగంతకులు అకస్మాత్తుగా కాల్పలు జరిపారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడ మృతిచెందగా, పలువురు గాయపడ్డారని సమాచారం. అయితే గాయపడిన వారిని పోలీసులు హుటాహుటిన అసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు,
గత కొద్ది రోజుల క్రితం వరకు బీజేపిలో కొనసాగిన కడబగెరి శ్రీనివాస్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాసనపురా వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా వున్న ఆయనను లక్ష్యంగా చేసుకునే అగంతకులు కాల్పులు జరిపారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు ఇద్దరు తలకు హెల్మెట్ పెట్టుకుని గుర్తుపట్టడానికి వీలు లేకుండా వున్నారని తెలుస్తుంది. అయితే శ్రీనివాస్ ను ఆయన ఇంటి వద్ద నుంచి ఫాలో అవుతున్న నిందితులు.. ఇవాళ ఉదయం 8.30 గంటల నుంచి పాలో అవుతున్నారని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తెలసింది.
ఈ కాల్పుల ఘటనతో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ తో పాటు అతని స్నేహితులను, డ్రైవర్ ను కూడా పోలీసులు అసుపత్రికి తరలించారు. కొలిగు క్రాస్ రోడ్డు వద్ద జరిగిన ఈ ఘటనపై పాదచారులు అందించిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును చేపట్టారు. ఫోరెన్సిక్ నిఫుణులతో పాటు డాగ్ స్వాడ్ తో వచ్చిన పోలీసులు ఘటనా స్థలంలో అధారలను అన్వేషించే పనిలో వున్నారు. కాగా సిసి ఫూటేజీని పరిశీలించి నిందితులను గుర్తిస్తామన్నారు. నిందితులు తప్పించుకోకుండా బెంగళూరు నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. నగరవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more