భాగ్యనగరంలో దెయ్యం భయం... లాడ్జీలో హల్ చల్! | Ghost in Koji lodge at Charminar.

Ghost attack in hyderabad hotel

Ghost attack, Hyderabad hotel, Hyderabad lodge Ghost, Ghost in hotel, Hyderabad ghost rumour, Ghost attack, Koji lodge in hyderabad, hyderabad ghost

Ghost attack in Hyderabad hotel. Police inquiry on such incident.

ITEMVIDEOS:హైదరాబాద్ హోటల్ లో దెయ్యం కలకలం

Posted: 01/21/2017 02:04 PM IST
Ghost attack in hyderabad hotel

వాస్తవం సంగతి పక్కనపెట్టి ప్రస్తుతం హైదరాబాద్ లో వెలుగుచూసిన ఓ ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఓ హోటల్ లో దెయ్యం అందులో బస చేసిన వారిపై దాడి చేసిందన్న వార్త ఒక్కసారిగా గుప్పుమంది. ఆ దెబ్బకు స్థానికులు మొత్తం రాత్రంతా రోడ్లపైనే గడపటం విశేషం.

వివరాళ్లోకి వెళ్లితే... మహారాష్ట్ర నుంచి డాక్టర్ సయ్యద్ కుటుంబం హైదరాబాద్ చూసేందుకు వచ్చింది. పాతబస్తీలోని కోజీ లాడ్జ్ లో వీరు బస చేశారు. మూడు రూమ్ లు తీసుకున్నారు. రెండు రూమ్ లలో కుటుంబ సభ్యులు పడుకోగా, మూడో రూమ్ లో డాక్టర్ సయ్యద్ తన తండ్రితో పాటు పడుకున్నాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో... ఒక్కసారిగా అరుపులు, కేకలు వినిపించాయి. అరుపులు విని పక్క గదుల్లో ఉన్న వారంతా బయటకు వచ్చారు. జరిగిన విషయం విని లాడ్జ్ నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు లాడ్జ్ కు చేరుకుని, ఏం జరిగిందని డాక్టర్ ను ప్రశ్నించారు.

 

తామందరం గాఢ నిద్రలో ఉండగా... తల లేని మొండెం తమపై కర్రతో దాడి చేసిందని డాక్టర్ సయ్యద్ తెలిపారు. తాము ప్రతిఘటించే ప్రయత్నం చేసేలోగానే తమను గోడకేసి కొట్టిందని చెప్పారు. ఆయన మాటలు విన్న పోలీసులు సైతం కంగుతిన్నారు. లాడ్జి యజమానైతే బిక్కచచ్చి పోయాడు. గతంలో ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదని లాడ్జి ఓనర్ తెలిపాడు. అయితే, తండ్రీకొడుకులు తీవ్రగాయాలతో గది నుంచి బయటకు రావడం గమనార్హం. పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Hotel  Ghost  Attack  

Other Articles